సినీనటుడు, దర్శకుడు, రచయిత అయిన తనికెళ్ల భరణి కి అరుదయిన గౌరవం లభించింది .తనికెళ్ళ రాసిన ఓ పుస్తకం బ్రిటీష్ పార్లమెంటులోవిడుదలకు నోచుకుంది.‘ప్యాసా’ టైటిల్తో తనికెళ్ళ భరణి రచించిన ఈ పుస్తకం అక్కడ రిలీజయ్యేలా చూడడంలో ఏపీ డిప్యూటీ స్పీకర్ మండలిబుద్ధప్రసాద్ కీలకపాత్ర పోషించారు బ్రిటీష్ ఎంపీ డాన్బైల్స్, బ్రిటన్ తెలుగు అసోసియేషన్ సభ్యులు ఇందుకు సహకరించారని తనికెళ్ళ తెలిపారు.తెలుగు అమ్మాయి నందిని రెడ్డి నివివాహం చేసుకున్న డాన్బైల్స్ ఈ పుస్తకం బ్రిటన్ పార్లిమెంట్ లో విడుదల కావటంలో ఎంతో సహకరించారని తనికెళ్ళ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
ఉమర్ ఖయ్యాం- ‘ రుబాయత్ ’ పుస్తకం స్ఫూర్తిగా తనికెళ్ల భరణి ప్యాసాను రచించారు.ఈ గ్రంథం ఆస్ర్టేలియాతోబాటు వివిధ దేశాల్లోకూడావిడుదలైంది.తనకు ఇది అరుదైన గౌరవంగా తనికెళ్ల భరణి భావిస్తున్నారు.ఒక తెలుగుపుస్తకం బ్రిటీష్ పార్లమెంట్లో ఆవిష్కరణ కావడం ఇదేమొట్టమొదటిసారి.
సినిమాలలో ఏ పాత్రనైనా అవలీలగా పోషించే భరణి రచయితగా కూడా ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చుకోవడం టాలీవుడ్ సినీపరిశ్రమకు గౌరవంగా మారింది.