ఈమధ్య ఇలాంటి హింసాత్మక వార్తలు ఎక్కువ చూస్తున్నాం కదా.వాటి నుంచి స్ఫూర్తి పొందడం వలన ఏమో మర్మాంగాలపైనే గురి పెడుతున్నారు.
గత ఏడాది భర్త తనతో శృంగారం చేయడం లేదనే కోపంతో అతడి పురుషాంగాన్ని కోసేసింది ఓ మహిళ.ఈ ఏడాది మరో ఇద్దరు భారతీయ మహిళలు ఇదే పని చేసారు.
కాని కారణాలే వేరు.ఈ ఇద్దరు కూడా తమ ఆత్మసంరక్షణ కోసం, తమ మానాన్ని కాపాడుకోవడం కోసం ఆ పని చేసారు.
ఇక కొత్తగా ఓ తమిళనాడు మహిళ నిద్రపోతున్న భర్త మర్మంగాన్ని కోసేసింది.కారణం ఏమిటో మీరే చూడండి.
తమిళనాడులోని గుడియట్టంకి చెందిన సరసు వయసు 30 ఏళ్ళు.16 ఏళ్ల వయసులో ఉండగానే పెళ్ళి జరిగింది.నలుగురు పిల్లలు.గత రెండేళ్లుగా భార్యభర్తల మధ్య తీవ్రమైన మనస్పర్థలు వచ్చాయి.ఇద్దరు తరచుగా గొడవపడేవారు.దాంతో ఇద్దరు వేరు వేరుగా ఉండటం ప్రారంభించారు.
పిల్లలని చదువు కోసం నానమ్మ, తాతయ్య దగ్గర ఉంచారు.భర్త ఒక ఇంట్లో ఒంటరిగా ఉంటే, సరసు తన తల్లిదండ్రులతో ఉండటం మొదలుపెట్టింది.
కాని ఒక నెల క్రితం ఇద్దరు తమ మనస్పర్థలు దూరం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు.కాని మళ్ళీ ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం వలన గొడవలు తగ్గకపోగా, మరింత పెరిగాయి.
భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడని భార్యకి, భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని భర్తకి అనుమానాలు పెరిగాయి.
మొన్న తాగిన మైకంలో ఆ భర్త నిన్ను వదిలేస్తాను, నువ్వు ముసలిదానివి అయిపోతున్నావ్, నేను ఇంకో అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాను అంటూ రచ్చ రచ్చ చేసాడట.
దాంతో ఇద్దరి మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది.గొడవ అనంతరం నిద్రలోకి జారుకున్నాడు భర్త.రాత్రి 2 గంటల ప్రాంతంలో భర్త గాఢ నిద్రలో ఉండగా, కిచెన్ లోంచి కత్తి తీసి అతడి మర్మంగాన్ని కోసేసి, తన హ్యాండ్ బ్యాగ్ లో వేసుకొని తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోయింది ఆవిడ.ఆ భర్త పెట్టిన కేకలు విన్న ఇరుగుపొరుగు వారు అతడిని హాస్పిటల్ కి తరలించారు.
అతడికి తీవ్ర గాయాలైనా, ప్రాణాలకైతే ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు డాక్టర్లు.
పోలీసులు సరసుని అరెస్టు చేసారు.
తన భర్తకి మరో అమ్మాయితో అక్రమ సంబంధం ఉందని, తాను లేని సమయాల్లో ఆ అమ్మాయిని ఇంటికి కూడా తెచ్చేవాడు అని, అందుకే ఈ పని చేసానని చెప్పుకొచ్చింది ఆ భార్య.