‘బాహుబలి’ సినిమా మరో 14 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న తరుణంలో ప్రస్తుతం అందరి దృష్టి కూడా ఈ సినిమాపైనే ఉంది.టాలీవుడ్ జక్కన్న రాజమౌళి అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిన ‘బాహుబలి’కి దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ వచ్చింది.
దాదాపుగా 5000 థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ క్రమంలోనే ‘బాహుబలి`2’కు సంబంధించిన వార్తలు మీడియాలో వస్తూనే ఉన్నాయి.
భారీ బడ్జెట్ అవ్వడంతో పాటు, కథను కుదించడం ఇష్టం లేక పోవడంతో జక్కన్న ‘బాహుబలి’ని రెండు పార్ట్లుగా తెరకెక్కించాడన్న విషయం తెల్సిందే.మొదటి పార్ట్ విడుదలకు సిద్దం అవ్వగా, రెండవ పార్ట్ కూడా ఇప్పటికే 75% చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లుగా చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది.
ఈ నేపథ్యంలో రెండవ పార్ట్లో తమిళ స్టార్ హీరో సూర్య ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు అని, సూర్య పాత్ర 10 నుండి 15 నిమిషాల పాటు స్క్రీన్పై ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు అనధికారికంగా చెబుతున్నారు.
‘బాహుబలి’ మొదటి పార్ట్ తమిళ రైట్స్ను సూర్య సోదరుడు జ్ఞానవేల్ రాజా సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.
రెండవ పార్ట్ను మరింతగా తమిళ ప్రేక్షకుల్లోకి తీసుకు వెళ్లేందుకు జక్కన్న ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని అంటున్నారు.