తమిళ సినీ నిర్మాతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఆ నిర్ణయం అములు అయ్యేది కానిది ఇంకా తెలియదు కాని, ఆ నిర్ణయం దేశం మొత్తం మీద చర్చనీయాంశం అవుతోంది.
పైరసీ భూతానికి వ్యతిరేకంగా తమిళ నిర్మాతలు మూడు నెలల పాటు సినిమాల విడుదల బంద్ చేయాలని నిర్ణయించారు.మూడు నెలల పాటు ఏ ఒక్క తమిళ సినిమా కూడా విడుదల కాదని స్పష్టం అయ్యింది.
అయితే ఈ నిర్ణయాన్ని కొందరు నిర్మాతలు వ్యతిరేకిస్తున్నారు.అయితే తమిళ నిర్మాతల మండలిలో ఎక్కువ శాతం మంది మాత్రం బంద్కు మద్దతు తెలుపుతున్నారు.
మూడు నెలల పాటు సినిమాల విడుదలను నిలిపేస్తే పెద్ద సినిమాలకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు.ఫైనాన్స్ తీసుకు వచ్చి నిర్మించిన సినిమాలను మూడు నెలల పాటు విడుదల చేయకుండా ఉంటే నిర్మాతలకు కోలుకోలేని దెబ్బ పడుతుందని కొందరు నిర్మాతలు అంటున్నారు.
మొత్తానికి ఈ బంద్ వ్యవహారం తమిళ నిర్మాతల్లో భేదాభ్రియాలను తీసుకు వస్తోంది.మరి ఈ సినిమా బంద్ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది.
ఈ బంద్ వల్ల నిర్మాతలు పైరసీని ఎలా అరికట్టగలరు అనేది చూడాలి.