స్టార్ హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ చేయడం ఈరోజుల్లో చాలా కామన్.అందులోనూ తమన్నా చేయడం ఇంకా కామన్.
ఇప్పటికే అల్లుడు శీను, స్పీడున్నోడు, జాగ్వర్ లాంటి చిత్ర్రాల్లో ఐటమ్ సాంగ్స్ చేసింది తమన్నా.అయితే స్టార్ హీరోలతో మాత్రం ఇప్పటివరకు ఐటమ్ సాంగ్ చేయలేదు మన మిల్కీ బ్యూటి.
మొత్తానికి, తొలిసారి ఓ స్టార్ పక్కన స్పెషల్ సాంగ్ లో చిందులేయనుంది.ఆ స్టార్ ఎవరో కాదు, యంగ్ టైగర్ ఎన్టీఆర్
జై లవ కుశలో ఒక మాంచి మాస్ పాట ఉందట.
ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్టు దేవిశ్రీప్రసాద్ ఎంతో శ్రద్ధగా ఈ ఐటమ్ సాంగ్ ని కంపోజ్ చేసినట్టు తెలుస్తోంది.ఇంతకుముందు జనతా గ్యారేజ్ లో కాజల్ తో చేయించిన పక్కా లోకల్ ఎంతగా హిట్ అయ్యిందో తెలిసిందే.
దానికి మించి ఈ ఐటల్ సాంగ్ ఉండాలంటే ఖచ్చితంగా మరో స్టార్ హీరోయిన్ కావాల్సిందే.అందుకే తమన్నాని సంప్రదించారట.
తమన్నా వెంటనే చేస్తానని ఒప్పుసుకుందని టాక్.అయితే తమన్నాకి ముందు రకుల్ ప్రీత్ తో సంప్రదింపులు జరిపారట.
మరి రెమున్యరేషన్ విషయంలో తేడా వచ్చిందో, డేట్స్ సర్దుబాటు కాలేదో కాని రకుల్ ఐటమ్ సాంగ్ చేయడం లేదు
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న జై లవ కుశని దర్శకుడు బాబి తెరకెక్కిస్తున్నాడు.ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తుండగా, ఎన్టీఆర్ కి జంటగా కనిపించనున్నారు రాశీఖన్నా, నివేతా థామస్.
సెప్టెంబరు 21న విడుదల కానుంది జైలవకుశ.