నాగార్జున, కార్తీలు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా ఇటీవలే ప్రారంభం అయిన విషయం తెల్సిందే.వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రసాద్ వి పొట్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
ఈ సినిమాలో హీరోయిన్గా ఎంపిక చేసిన శృతిహాసన్ డేట్స్ కుదరక పోవడం వల్ల తప్పుకున్న విషయం తెల్సిందే.శృతిహాసన్పై చిత్ర నిర్మాణ సంస్థ తాజాగా కేసు పెట్టడం జరిగింది.
తాజాగా ఈ సినిమా కోసం మరో హీరోయిన్ను వెదికే పనిలో దర్శకుడు వంశీ పైడిపల్లి పడ్డట్లుగా సినీ వర్గాల నుండి సమాచారం అందుతోంది.
ఇప్పటికే ఈయన దృష్టిలో ముగ్గురు పడ్డారని త్వరలో ఆ ముగ్గురిలో ఎవరో ఒక్కరిని ఫైనల్ చేసే అవకాశాలున్నాయని చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.
ఆ ముగ్గురు ఎవ్వరంటే… అంజలి, సమంత, తమన్నాలు.ఈ ముగ్గురు కూడా తెలుగు మరియు తమిళంలో గుర్తింపు ఉన్న విషయం తెల్సిందే.
ద్వి భాష చిత్రం కనుక అక్కడ ఇక్కడ గుర్తింపు ఉన్న వారిని పెట్టాలని దర్శకుడి ప్లాన్.ఇక ఈ ముగ్గురిలో అంజలికి ఎక్కువ అవకాశాలున్నాయని అంటున్నారు.
కారణం మిగిలిన ఇద్దరు హీరోయిన్స్ కూడా బిజీగా ఉండటంతో పాటు, ఎక్కువ పారితోషికం డిమాండ్ చేసే అవకాశాలున్నాయి.అందుకే అంజలికి ఎక్కువ ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంటున్నారు.
త్వరలోనే ఈ మల్టీస్టారర్ మూవీలో హీరోయిన్ ఎవరు అనే క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.