శృతి ప్లేస్‌లో ఎవరు?

నాగార్జున, కార్తీలు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్‌ సినిమా ఇటీవలే ప్రారంభం అయిన విషయం తెల్సిందే.వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రసాద్‌ వి పొట్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

 Tamannah To Replace Shruthi Hassan..?-TeluguStop.com

ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేసిన శృతిహాసన్‌ డేట్స్‌ కుదరక పోవడం వల్ల తప్పుకున్న విషయం తెల్సిందే.శృతిహాసన్‌పై చిత్ర నిర్మాణ సంస్థ తాజాగా కేసు పెట్టడం జరిగింది.

తాజాగా ఈ సినిమా కోసం మరో హీరోయిన్‌ను వెదికే పనిలో దర్శకుడు వంశీ పైడిపల్లి పడ్డట్లుగా సినీ వర్గాల నుండి సమాచారం అందుతోంది.

ఇప్పటికే ఈయన దృష్టిలో ముగ్గురు పడ్డారని త్వరలో ఆ ముగ్గురిలో ఎవరో ఒక్కరిని ఫైనల్‌ చేసే అవకాశాలున్నాయని చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.

ఆ ముగ్గురు ఎవ్వరంటే… అంజలి, సమంత, తమన్నాలు.ఈ ముగ్గురు కూడా తెలుగు మరియు తమిళంలో గుర్తింపు ఉన్న విషయం తెల్సిందే.

ద్వి భాష చిత్రం కనుక అక్కడ ఇక్కడ గుర్తింపు ఉన్న వారిని పెట్టాలని దర్శకుడి ప్లాన్‌.ఇక ఈ ముగ్గురిలో అంజలికి ఎక్కువ అవకాశాలున్నాయని అంటున్నారు.

కారణం మిగిలిన ఇద్దరు హీరోయిన్స్‌ కూడా బిజీగా ఉండటంతో పాటు, ఎక్కువ పారితోషికం డిమాండ్‌ చేసే అవకాశాలున్నాయి.అందుకే అంజలికి ఎక్కువ ఛాన్స్‌ ఉందని విశ్లేషకులు అంటున్నారు.

త్వరలోనే ఈ మల్టీస్టారర్‌ మూవీలో హీరోయిన్‌ ఎవరు అనే క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube