‘ఏమాయ చేశావే’, ‘ఆటోనగర్ సూర్య’, ‘మనం’ చిత్రాల్లో రొమాన్స్ చేసిన అక్కినేని నాగచైతన్య మరియు సమంతలు మరోసారి రొమాన్స్ చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వచ్చాయి.ఆ సినిమాలో కూడా మరోసారి వీరిద్దరి లిప్లాక్ ఉంటుందని కూడా అంతా అనుకున్నారు.
‘కార్తికేయ’ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య నటించబోతున్న సినిమాలో సమంతను హీరోయిన్గా ఎంపిక చేసినట్లుగా వార్తలు వచ్చాయి.అయితే ఆ వార్తలు నిజం కాదని తేలిపోయింది.
ఇప్పటికే నాగచైతన్య సరసన తమన్నాను ఎంపిక చేసినట్లుగా దర్శకుడు చందు ప్రకటించాడు.
‘కార్తికేయ’ సినిమాతో మంచి సక్సెస్ను అందుకున్న చందుతో పలువురు యువ హీరోలు సినిమాలు చేయాలని ఆసక్తి కనబర్చారు.
అయితే ఈయన మాత్రం అక్కినేని హీరోతో సినిమా చేసేందుకు సిద్దం అవుతున్నాడు.ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తి అయిన ఈ సినిమాను వచ్చే నెలలో ప్రారంభించాలని నిర్ణయించారు.‘100% లవ్’, ‘తడాఖ’ సినిమాల్లో జత కట్టిన చైతూ, తమన్నాలు మరోసారి ఈ సినిమా కోసం రొమాన్స్కు సిద్దం అవుతున్నారు.మొదట సమంతను అనుకున్నప్పటికి కొన్ని కారణాల వల్ల ఆమె నో చెప్పడంతో ఈ సినిమాలో తమన్నాను తీసుకుని ఉంటారు అనే వార్తలు కూడా వస్తున్నాయి.
మొత్తానికి చైతూ, తమన్నాల జోడీ హ్యాట్రిక్ కొడుతుందేమో చూడాలి.