చరణ్ దర్శకుడితో జాగ్వార్ కుర్రాడు..!

కర్ణాటక మాజి ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ హీరోగా ఈ మధ్యనే రిలీజ్ అయిన సినిమా జాగ్వార్.సినిమా టాక్ ఎలా ఉన్నా కలక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి ఓ రేంజ్ పబ్లిసిటీ చేయబట్టి ఓపెనింగ్స్ అదరగొట్టాయి.

 Surender Reddy Will Direct Nikhil Second Movie-TeluguStop.com

తెలుగులో ఎలా ఉన్నా కన్నడలో మాత్రం సినిమా పర్వాలేదు అనిపించుకుంది.కొత్త కుర్రాడే అయినా నిఖిల్ పర్ఫార్మెన్స్ పర్వాలేదు అంటున్నారు.

అయితే ఈ సినిమా తర్వాత వెంటనే తనయుడి సెకండ్ సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాడు కుమారస్వామి.

అసలైతే మొదటి సినిమానే పూరి జగన్నాథ్ లాంటి డైరక్టర్ తో తీయాల్సి ఉంది.

కాని కుదరలేదు మహదేవ్ డైరెక్ట్ చేసిన జాగ్వార్ తెలుగు ఆడియెన్స్ కు రుచించలేదు కాని ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం అదరహో అనేస్తున్నారు.ఇక ఇప్పుడు సెకండ్ సినిమా కోసం చరణ్ ధ్రువ డైరెక్ట్ చేస్తున్న సురేందర్ రెడ్డిని లైన్లో పెట్టాడట.

స్టార్ హీరోలతో సినిమాలు తీసిన సురేందర్ రెడ్డి జాగ్వార్ నిఖిల్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు.ఇక ఈ సినిమాకు గాను సురేందర్ రెడ్డికి బాగానే ముడుతున్నాయట.

అంతేకాదు తెలుగు కన్నడ భాషల్లో ఈ సినిమా ఉండబోతుందట.మరి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నిఖిల్ ఎలా ఉంటాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube