కర్ణాటక మాజి ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ హీరోగా ఈ మధ్యనే రిలీజ్ అయిన సినిమా జాగ్వార్.సినిమా టాక్ ఎలా ఉన్నా కలక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి ఓ రేంజ్ పబ్లిసిటీ చేయబట్టి ఓపెనింగ్స్ అదరగొట్టాయి.
తెలుగులో ఎలా ఉన్నా కన్నడలో మాత్రం సినిమా పర్వాలేదు అనిపించుకుంది.కొత్త కుర్రాడే అయినా నిఖిల్ పర్ఫార్మెన్స్ పర్వాలేదు అంటున్నారు.
అయితే ఈ సినిమా తర్వాత వెంటనే తనయుడి సెకండ్ సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాడు కుమారస్వామి.
అసలైతే మొదటి సినిమానే పూరి జగన్నాథ్ లాంటి డైరక్టర్ తో తీయాల్సి ఉంది.
కాని కుదరలేదు మహదేవ్ డైరెక్ట్ చేసిన జాగ్వార్ తెలుగు ఆడియెన్స్ కు రుచించలేదు కాని ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం అదరహో అనేస్తున్నారు.ఇక ఇప్పుడు సెకండ్ సినిమా కోసం చరణ్ ధ్రువ డైరెక్ట్ చేస్తున్న సురేందర్ రెడ్డిని లైన్లో పెట్టాడట.
స్టార్ హీరోలతో సినిమాలు తీసిన సురేందర్ రెడ్డి జాగ్వార్ నిఖిల్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు.ఇక ఈ సినిమాకు గాను సురేందర్ రెడ్డికి బాగానే ముడుతున్నాయట.
అంతేకాదు తెలుగు కన్నడ భాషల్లో ఈ సినిమా ఉండబోతుందట.మరి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నిఖిల్ ఎలా ఉంటాడో చూడాలి.