మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కెరీర్లో తొలిహిట్ అందుకున్నాడు.ఇన్నిరోజులుగా ప్రాఫిటెబుల్ ప్రాజెక్టు ఇవ్వడానికి తంటాలు పడ్డ ఈ కుర్ర హీరో, ఎట్టకేలకు లాభాలు తెచ్చిపెట్టాడు.
ఇంతకుముందు సుబ్రహ్మణ్య ఫర్ సేల్, పిల్లా నువ్వు లేని జీవితం వంటి చిత్రాలు చిన్నపాటి నష్టాలతో యావరేజ్ గా నిలిచాయి.
ఇక సాయి కొత్తగా నటించిన సుప్రీమ్ , తన కెరీర్లో ఇప్పటికే అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది.
అంతేకాకుండా లాభాలు అర్జించడం మొదలుపెట్టింది.అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించిన సుప్రీమ్, మంచి వసూళ్ళులతో అదరగొడుతోంది.
సెకండ్ సినిమా ఫ్లాప్ అనే సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తూ మళ్ళీ పటాస్ లాంటి హిట్ అందుకున్నాడు అనిల్ రావిపూడి.నిన్నటితో ,ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల షేర్ మార్కుని దాటేసింది సుప్రీమ్.