పూరి జగన్నాథ్ తాజా చిత్రం రోగ్.ఇషాన్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో మన్నారా చోప్రా, ఎంజెలా హీరోయిన్లుగా నటించారు.
హీరో సొంత కుటుంబసభ్యులు సీఆర్.మనోహర్, సీఆర్.
గోపి ఈ తెలుగు – కన్నడ ద్విభాషా చిత్రాన్ని భారీ స్థాయిలోనే నిర్మించారు.ఇప్పుడు అంతే భారి స్థాయిలో సినిమాని ప్రమోట్ కూడా చేస్తున్నారు.
నిన్న జరిగిన రోగ్ ఆడియో ఫంక్షన్ లో ఏకంగా సన్ని లియోన్ తో డ్యాన్స్ చేయించారంటేనే అర్థం చేసుకోండి, ఇషాన్ కి ఎంత ప్యాడింగ్ ఇస్తున్నారో.
సన్నితో ఓ ఫంక్షన్ లో డ్యాన్స్ చేయించడం అంటే మాటలు కాదు.
నూతన సంవత్సరం రాత్రి సన్నితో డ్యాన్స్ చేయించడానికి కోట్లు కుమ్మరిస్తాయి పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లు.కరెంట్ తీగలో చేసిన స్పెషల్ సాంగ్ కి సన్ని అప్పట్లో 75 లక్షల దాకా ఛార్జ్ చేసింది.
అట్లాంటిది రోగ్ ఆడియో ఫంక్షన్ కోసం సన్నిలియోన్ ని స్పెషల్ గా రప్పించి డ్యాన్సులు వేయించారు.
సన్నిని రప్పించాలనే ఐడియా పూరి బిజినెస్ పార్టనర్ ఛార్మీది అంట.పూరికి కూడా ఈ ప్లాన్ నచ్చడంతో వెంటనే సంప్రదించారు, రప్పించారు.నిన్న రాత్రి హైదరాబాద్ లో తెగ సందడి చేసింది హాట్ సన్ని.
చిటికెలో కాస్ట్యూమ్స్ మారుస్తూ, పాటలు మారుస్తూ, తన చిందులతో ఆడియో ఫంక్షన్ కి వచ్చిన జనాల్ని బాగానే అలరించింది.అయితే ఒక్క రాత్రి డ్యాన్స్ చేసినందుకు పూరి ఆండ్ టీమ్ ఆమెకి ఎంత సమర్పించుకున్నారో తెలుసా? 35-40 లక్షల రూపాయలంట.
ఏంటి, కొన్ని నిమిషాల పాటు డ్యాన్స్ చేసినందుకు అంత మొత్తమా అని ఆశ్చర్యపోతున్నారంటే, మీకు సన్నిలియోన్ కి మార్కేట్లో ఉన్న డిమాండ్ గురించి అవగాహన లేనట్టే.కేవలం పేమెంట్ మాత్రమే కాదు, సన్నిలియోన్ రావడానికి, పోవడానికి కాస్ట్లీ ఫ్లయిట్ టికెట్స్, వసతి కోసం స్టార్ హోటల్ ఖర్చులు, అన్ని రోగ్ టీమ్ పెట్టుకున్నవే.