రోడ్డు మీద ప్రయాణిస్తే యాక్సిడెంట్ ల భయం ఉంటుంది, ట్రైన్ అయితే ఎక్కడ పట్టాలు తప్పుతుందో చెప్పలేం, నీటిలో వెళితే ఎప్పుడు నావ ఎప్పుడు మునుగుతుందో, ఏ సునామి వస్తుందో కనిపెట్టలేం, మరీ గాలిలో ప్రయాణిస్తే ప్రమాదం ఉండదా అంటే అక్కడ కూడా ఉంటుంది.మనిషి ప్రాణాలకి ఎక్కడా గ్యారంటీ లేదండి.
నిన్న సన్నిలియోన్ చావు అంచుల దాకా వెళ్ళి బ్రతికింది తెలుసా?
విషయం ఏమిటంటే, నిన్న సన్నిలియోన్ తన భర్త, కొంతమంది స్నేహితులతో కలిసి ఓ ప్రైవేట్ ప్లేన్ లో ఏదో పని మీద బయలుదేరింది.కాని వాతావరణ సమస్యలు వచ్చాయట.
దాంతో ప్లేన్ క్రాష్ అయ్యే సూచనలు కనిపించాయి.జీవితంలోని చివరి క్షణాలు ఆకాశంలోనే గడుపుతున్నాం అనుకున్నారట అంతా.
కాని సన్ని నియమించుకున్న పైలెట్లు చాకచక్యంగా వ్యవహరించి పెద్ద ప్రమాదాన్ని తప్పించి, సాఫీగా విమానాన్ని నేలమీదకి దింపారట.అది ఎక్కడో మహారాష్ట్రలోని మారుమూల ప్రాంతం.ఇక అక్కడినుంచి కారు అద్దెకు తీసుకోని తిరిగి ఇంటికి బయలుదేరింది సన్ని.
“దేవుడుకి కృతజ్ఞతలు చెప్పాలి.మేమంతా బ్రతికిపోయాం.వాతావరణంలో మార్పుల వలన మా ప్రైవేట్ ప్లేన్ దాదాపుగా కూలిపొయే పరిస్థితికి వచ్చింది.అందరం భయపడ్డాం.కాని మా అదృష్టం బాగుంది.
మాహారాష్ట్రలోని ఏదో మారుమూల ప్రాంతంలో ఉన్నాం ఇప్పుడు.ప్రాణాలతో ఇంటికి బయలుదేరుతున్నాం” అంటూ ఓ వీడియో పోస్ట్ చేసి, లక్షలాది అభిమానులకు ఊరటనిచ్చే వార్తను తెలియజేసింది సన్ని.