‘భీమవరం బుల్లోడు’ సునీల్ తెలంగాణ ప్రభుత్వ పార్టీ అయిన టీఆర్ఎస్కు మద్దతు పలికాడు.ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో టీఆర్ఎస్ పార్టీకి సునీల్ జై కొట్టడం చర్చనీయాంశం అయ్యింది.
తాజాగా సునీల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలపై ప్రశంసల జల్లు కురిపించాడు.పైగా ఈ ఎన్నికల్లో తన సంపూర్ణ మద్దతు టీఆర్ఎస్కే అంటూ బహిరంగంగానే ప్రకటించాడు.
ఆంధ్రాకు చెందిన సునీల్ ఇలా టీఆర్ఎస్కు జై కొట్టడం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది.
సునీల్ ఏ ఉద్దేశ్యంతో టీఆర్ఎస్కు జై కొట్టాడో అన్న కోణంలో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.
ప్రభుత్వం నుండి ఏదో ఆశించే ఇలా సునీల్ జై టీఆర్ఎస్ అని ఉంటాడు అని, త్వరలోనే సునీల్ కోరుకున్నది తెలంగాణ ప్రభుత్వం సమర్పిస్తుందంటూ ఫిల్మ్ సర్కిల్స్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం సునీల్ హీరోగా నటించిన ‘కృష్ణాష్టమి’ చిత్రం విడుదలకు సిద్దం అవుతున్న విషయం తెల్సిందే.
ఆ సినిమా నిర్మాత దిల్రాజు తెలంగాణకు చెందిన వ్యక్తి.ఆయన సలహా మేరకు ఈ భీమవరం బుల్లోడు జై టీఆర్ఎస్ అని ఉంటాడు అని కూడా కొందరు అంటున్నారు.
మొత్తానికి సునీల్పై రాజకీయ చర్చలు భారీగా వస్తున్నాయి.