సునీల్ ప్రస్తుతం ‘కృష్ణాష్టమి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.ఈ సినిమాను ఒప్పుకోక ముందే ప్రముఖ రచయిత గోపీ మోహన్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
గోపీ మోహన్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్న సమయంలో దిల్రాజు ‘కృష్ణాష్టమి’ ప్రాజెక్ట్ను సునీల్ వద్దకు తీసుకు వచ్చాడు.పెద్ద బ్యానర్ అవ్వడంతో పాటు దిల్రాజుపై ఉన్న గౌరవంతో సునీల్ కాదనలేక పోయాడు.
వాసు వర్మ దర్శకత్వంలో ‘కృష్ణాష్టమి’ చిత్రం తెరకెక్కుతుంది.ముందుగా అనుకున్న ప్రకారం అయితే మూడు నెలల డేట్స్ను సునీల్ ఇచ్చాడు.
కాని కొన్ని కారణాల వల్ల ‘కృష్ణాష్టమి’ ఆలస్యం అయ్యింది.దాంతో గోపీ మోహన్ తాను ఇక సునీల్పై ఆశలు వదులుకుని మరో సినిమా సన్నాహాల్లో ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు.
సునీల్తో సినిమా చేయడం కోసం చాలా ఎదురు చూశాను, అయితే సునీల్ ‘కృష్ణాష్టమి’ చిత్రానికి ఎక్కువ డేట్లు కేటాయించడంతో నా సినిమా ఆలస్యం అయ్యిందని అన్నాడు.ప్రస్తుతం తాను ఆ స్క్రిప్ట్ను పక్కకు పెట్టి కొత్త స్క్రిప్ట్ను రెడీ చేస్తున్నట్లుగా గోపీ మోహన్ ప్రకటించాడు.
అంతా కొత్త వారితో తన సినిమాను వచ్చే సంవత్సరం ప్రారంభంలో ఆరంభిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.ప్రస్తుతానికి సునీల్తో సినిమా అటకెక్కినట్లే అని అంటున్నారు.
మరి భవిష్యత్తులో అయినా ఆ సినిమా ఉంటుందా అనేది అనుమానమే.పాపం సునీల్ ఆలస్యం చేయడం వల్ల గోపీ మోహన్ ఇక ఎదురు చూడలేక కొత్త వారితో సినిమా చేసేందుకు కమిట్ అయ్యాడు.