క్రియేటివ్‌ డైరెక్టర్‌ ఇన్నాళ్లకు..

మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌తో ‘గోవిందుడు అందరి వాడేలే’ చిత్రాన్ని తెరకెక్కించిన తర్వాత కృష్ణవంశీ మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది లేదు.ఇన్నాళ్లుగా కృష్ణవంశీ ఏవో కారణాల వల్ల సినిమాను మొదలు పెట్టలేదు.

 Krishna Vamsi’s New Film Launched-TeluguStop.com

తాజాగా కృష్ణవంశీ సినిమా షురూ అయ్యింది.యువ హీరో సందీప్‌ కిషన్‌తో కృష్ణవంశీ ‘ఖడ్గం’ సీక్వెల్‌ చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

ఆ వార్తలను నిజం చేస్తూ దర్శకుడు కృష్ణవంశీ తాజాగా కృష్ణవంశీతో సినిమాను షురూ చేశాడు.అయితే ఇది ‘ఖడ్గం’కు సీక్వెల్‌ అవునా కాదా అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.

ఈ చిత్రంలో సందీప్‌ కిషన్‌ పవర్‌ ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.మరో రెండు రోజుల అయితే మంచి రోజులు పోయి మూడాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది.

జూన్‌లో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించబోతున్నారు.ఈ సినిమా చేయనుండటం పట్ల సందీప్‌ కిషన్‌ చాలా సంతోషంగా ఉన్నాడు.

ఎప్పుడెప్పుడు కృష్ణవంశీ దర్శకత్వంలో సినిమా చేస్తానా అని ఆసక్తితో ఎదురు చూస్తున్నా అంటూ సందీప్‌ ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశాడు.కృష్ణవంశీ, సందీప్‌ కిషన్‌ల సినిమాకు ‘నక్షత్రం’ అనే టైటిల్‌ను ఖరారు చేయడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube