‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్ కిషన్ ఆ సినిమా తర్వాత శరవేగంగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు.‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ ముందు వరకు పెద్దగా సక్సెస్లు లేక చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ వచ్చిన సందీప్ కిషన్ ప్రస్తుతం వరుసగా పెద్ద సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు.
ఇటీవలే రామోజీరావు నిర్మించిన ‘బీరువా’ సినిమాలో నటించి మెప్పించిన సందీప్ కిషన్ తాజాగా ‘టైగర్’ అనే సినిమాలో నటించి ఆకట్టుకోబోతున్నాడు.
తాజాగా ‘టైగర్’ ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది.
ఆడియో విడుదల కార్యక్రమంలో సినిమా ట్రైలర్ను కూడా విడుదల చేశారు.ఆ ట్రైలర్కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.
ఈ సినిమాతో సందీప్ కిషన్ హీరోగా మరో మెట్టు పైకి ఎక్కడం ఖాయం అని అంటున్నారు.మాస్ ప్రేక్షకులను ఈ సినిమాతో తప్పకుండా ఆకట్టుకుంటాడని కూడా విశ్లేషకులు అంటున్నారు.
మొత్తాని సందీప్ కిషన్కు మాస్ క్రేజ్ ఈ సినిమాతో రాబోతుంది.