ప్రముఖ దర్శకుడు, నిర్మాత అయిన గుణశేఖర్పై నటుడు సుమన్ చీటింగ్ కేసు పెట్టాడు.గుణశేఖర్ తనకు ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యిందని, ఆ విషయాన్ని ఆయనకు చెప్పేందుకు ప్రయత్నించగా ఆయన సరైన స్పందన వ్యక్తం చేయలేదని చెబుతూ పోలీసులకు సుమన్ ఫిర్యాదు చేశాడు.
సుమన్ కేసును స్వీకరించిన పోలీసులు గుణశేఖర్పై 420 కింద చీటింగ్ కేసును బుక్ చేయడం జరిగిందని తెలుస్తోంది.
గుణశేఖర్ తాజాగా ‘రుద్రమదేవి’ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించిన విషయం తెల్సిందే.
ఆ సినిమాలో సుమన్ నటించాడు.అందుకు సంబంధించిన పేమెంట్ విషయంలో వీరిద్దరి మధ్య ఈ వివాదం వచ్చినట్లుగా తెలుస్తోంది.
గుణశేఖర్ సుమన్కు ఇవ్వాల్సిన పారితోషికం అయిదు లక్షలను చెక్ రాసి ఇవ్వడం జరిగిందట.అయితే ఆ చెక్ బౌన్స్ అవ్వడంతో సుమన్ మొదట గుణశేఖర్తో సంప్రదించేందుకు ప్రయత్నించి విఫలం అయ్యాడు.
దాంతో సుమన్ ఈ కేసు పెట్టడం జరిగిందట.ఇటీవలే గుణశేఖర్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడంటూ వార్తలు వచ్చిన విషయం తెల్సిందే.
తాజాగా ఇలా చెక్ బౌన్స్ వ్యవహారంతో గుణశేఖర్ నిజంగానే ఆర్థిక ఇబ్బందులు తీవ్రంగా ఎదుర్కొంటున్నట్లుగా అర్థం అవుతోంది.