పక్కా మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఇప్పుడు క్లాస్ ఫాలోయింగ్ సంపాదించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.అందుకే ధృవ లాంటి కథాబలం ఉన్న సినిమా తరువాత సుకుమార్ ని, ఆ తరువాత మణిరత్నం ని లైన్ లో పెట్టాడు ఈ మెగాహీరో.
ఇక ధృవ వాయిదా పడిందని ఓ పక్క మెగాఫ్యాన్స్ ఇప్పటికే నిరుత్సాహంలో ఉంటే, ఫిలింనగర్ లో వినబడుతున్న మరో వార్త వింటే మెగాఫ్యాన్స్ కి మరింత కంగారు మొదలవుతుందేమో.విషయం ఏమిటంటే, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రామ్ చరణ్ – సుకుమార్ సినిమా అక్టోబర్ లో మొదలవ్వాలి.
కాని ఈ సినిమా మరికొంత ఆలస్యంగా మొదలవ్వొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.దానికి కారణం సుకుమారే.
దర్శకుడు అల్రెడీ చెప్పిన కథ రామ్ చరణ్ కి బాగా నచ్చినా, ఇప్పుడున్న కథ రామ్ చరణ్ కి అంతగా నప్పదని, కొత్త కథ సిద్ధం చేస్తున్నాడట సుకుమార్.ఇదే నిజమైతే స్క్రిప్టు వర్క్ పూర్తయ్యేవరకూ ఇంకొంత సమయం పడుతుంది.
అంటే, సినిమా మొదలవ్వటంలో మరికొంత ఆలస్యం జరుగుతుందన్నమాట.