రాజ్యసభలో సుజనా గోడు

కేంద్రంలో టీడీపీ మంత్రి సుజనా చౌదరి గోడు వెళ్లబోసుకున్నారు.మంత్రి గోడు ఏమిటో తెలిసే ఉంటుంది.

 Sujana Highlights Ap Reorganisation Act In Rajya Sabha-TeluguStop.com

ఉమ్మడి రాష్ట్ర విభజన కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయాలని మంత్రి విన్నవించుకున్నారు.న్యాయం చేయడం అంటే ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరడమే.

ప్రత్యేక హోదా అమలు కోసం ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు.కాంగ్రెస్ ప్రభుత్వం (యూపీఏ ) ఎటువంటి పధ్ధతి , విధానం లేకుండా రాష్ట్రాన్ని విభజన చేసిందని మంత్రి అన్నారు.

రాష్ట్ర విభజనలో రాజ్యాంగ సూత్రాలను , ప్రజాస్వామిక విలువలను పట్టించుకోలేదని విమర్శించారు.రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకం కాదని, విభజనలో కాంగ్రెస్ అనుసరించిన విధానాలను తప్పుపడుతున్నామని చెప్పారు.

రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ ఆ పని చేసి కూడా ఎలాంటి ప్రయోజనం పొందలేదన్నారు.టీడీపీ నాయకులు ఎంతసేపటికీ కాంగ్రెసును తిడుతున్నారు.

కానీ బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని ఏమీ అనలేకపోతున్నారు.సుజనా చౌదరి రాష్ట్రానికి న్యాయం చేయాలని నామమాత్రంగా ప్రస్తావించి ఉంటారు తప్ప అంత సీరియస్ నెస్ ఉండకపోవచ్చు.

టీడీపీ పార్లమెంటులో మాట్లాడకపోతే ప్రతిపక్షాలు విమర్శిస్తాయి.ఆ భయంతోనే రాష్ట్రానికి న్యాయం చేయాలని మంత్రి అడిగారేమో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube