సూపర్ స్టార్ కృష్ణ చాలా చాలం తర్వాత నటిస్తున్న చిత్రం ‘శ్రీ శ్రీ’.ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కావచ్చింది.
భారీ అంచనాలున్న ఈ సినిమాలో మొదట మహేష్బాబు చిన్న గెస్ట్ రోల్లో కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.అయితే మహేష్బాబు బిజీ షెడ్యూల్ వల్ల ఈ సినిమాలో నటించలేక పోయాడు.
దాంతో ఆ గెస్ట్ రోల్ను సుధీర్బాబును చేయించాలని కృష్ణ నిర్ణయించుకున్నాడు.త్వరలోనే ఆ సినిమా షూటింగ్లో సుధీర్బాబు పాల్గొనబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
కృష్ణ, విజయనిర్మల ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో సాయి కుమార్ మరియు సీనియర్ నరేష్ కూడా నటిస్తున్నారు.ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడట.
సుధీర్బాబు చేసే గెస్ట్ రోల్ సినిమాకు చాలా ముఖ్యమని, ఆయన ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.ఇక ఈ సినిమా ఆడియోను మహేష్బాబు చేతుల మీదుగా విడుదల చేయించబోతున్నారు.
వచ్చే నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.ఇప్పటికే విడుదలైన స్టిల్స్ మరియు పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.