యాంకర్ అనసూయ టైమ్ మామూలుగా నడవట్లేదు.ఇటు టీవి రంగంలో, అటు సినిమా రంగంలో హాట్ కేక్ లాగా మారిపోయింది ఈ అందాల యాంకర్.
సాయిధరమ్ తేజ్ నటించిన విన్నర్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో డ్యాన్స్ చేసినందుకు అనసూయ నిర్మాతల నుంచి భారి మొత్తమే అడిగిందట.మొదట 10 లక్షల పేమేంట్ అందుతున్నట్లు వార్తలొచ్చాయి కాని, ఆది కేవలం అడ్వాన్స్ అని తరువాత తేలింది.
నిజానికి అనసూయ చేసుకున్న ఒప్పందం ప్రకారం బడా నిర్మాతలైన ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జి అనసూయకి 25 లక్షలు చెల్లించాలట.కాని ఇప్పటివరకు అడ్వాన్స్ కింద ఇచ్చిన 10 లక్షలు తప్పిస్తే, అనసూయకి ఇంకేమి ఇవ్వలేదట.
సినిమా విడుదలకి ఇంకా నాలుగు రోజులే పెట్టుకోని ఇంకా తన డబ్బు ఇవ్వకపోవడంతో అనసూయ పరేషాన్ అవుతున్నట్లు వార్తలోస్తున్నాయి.
నల్లమలుపు బుజ్జి సంగతి తెలీదు కాని, మహేష్ బాబుతో చేస్తున్న సినిమా బడ్జెట్ వంద కోట్లు కావడంతో కొంచెం ఫైనాన్షియల్ గా ఇబ్బందిపడుతున్నారేమో .ఇక మెచ్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, అనసూయ తనకు ఈ నిర్మాతలు అప్పు ఉన్నా, ఓపిగ్గా ఉంటోందే తప్ప, మీడియాలో ఎలాంటి హంగామా చేయట్లేదు.