తమిళనాట అమ్మగా, పురుచ్చితలైవిగా ఎంతో మంది ప్రజల హృదయాల్లో ఎప్పటకీ చెరగిపోని గూడు కట్టుకున్న జయలలిత మృతితో తమిళ ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు.ఇటు వెండితెర మీద అటు పొలిటికల్ తెరమీద జయది తిరుగులేని ప్రస్థానం.
జయలలిత శాశ్వత సెలవు తీసుకోవడంతో తమిళ హిస్టరీలో ఓ మహా శకానికి తెరపడినట్లయ్యింది.
ఇదిలా ఉంటే జయ నిజ జీవితం ఇప్పటికే వెండితెర మీద కూడా ఆవిష్కృతమైంది.
ప్రముఖ దర్శకుడు మణిరత్నం జయ నిజ జీవితాన్ని ఇప్పటికే తన ఇరువర్ (తెలుగులో ఇద్దరు ) సినిమాలో ఆవిష్కరింపజేశారన్న చర్చ ఉంది.తమిళనాట ముందు ఎంతో మంచి మిత్రులుగా మెలిగి తర్వాత బద్ధ శత్రువులుగా మారిన ఎంజీఆర్, కరుణానిధి జీవితాలతో పాటు వారి మధ్య జరిగిన స్టోరీ ఆధారంగా మణిరత్నం ఇద్దరు సినిమాను తెరకెక్కించారన్న టాక్ ఉంది.
ఇద్దరు సినిమాలో ఎంజీఆర్ రోల్ను ప్రముఖ మళయాళ సూపర్స్టార్ మోహన్లాల్ పోషిస్తే, కరుణానిధి రోల్లో ప్రకాష్రాజ్ నటించారు.ఇక ఈ సినిమాతో వెండి తెరకు పరిచయం అయిన ఐశ్వర్యారాయ్ మోహన్లాల్కు ముందు భార్యగాను, ప్రేయసి గాను డ్యూయల్ రోల్లో నటించింది.
ఇద్దరులో మోహన్లాల్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఐశ్వర్య…అప్పటికే మోహన్లాల్కు మరో భార్య ఉన్నా అతడితో సంబంధం పెట్టుకుంటుంది.అయితే మరీ నిజజీవిత పాత్రలనే అనుమానం రాకుండా దర్శకుడు మణిరత్నం ఐశ్వర్య రెండు క్యారెక్టర్లను సినిమాలో చంపేశారు.
వాస్తవానికి ఎంజీఆర్ భార్య యాక్సిడెంట్లో చనిపోతుంది.సినిమాలో సైతం ముందు ఐశ్వర్య పోషించిన ఆ రోల్ను చంపేసిన దర్శకుడు తర్వాత జయలలిత పాత్రను సైతం చివర్లో ఎండ్ చేసేశారు.
జయ రోల్ ఐశ్వర్య పోషించిందన్న ఫీల్ రాకుండా ఉండేందుకు మణిరత్నం అలా చేసినా అది జయలలిత క్యారెక్టరే అన్న విషయం ప్రతి తమిళుడికి తెలిసిందే.ఇక ఇద్దరు కమర్షియల్ సక్సెస్ కొట్టకపోయినా అప్పటకీ, ఇప్పటకీ ఓ సంచలనాత్మక చిత్రంగానే మిగిలిపోయింది.