టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అయిన శ్రీనువైట్లపై కొన్ని రోజుల క్రితం ఆయన భార్య రూప జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో గృహహింస కేసు పెట్టినట్లుగా నిన్నటి నుండి మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే.శారీరకంగా మరియు మానసికంగా శ్రీనువైట్ల తనను వేదిస్తున్నాడు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దాంతో ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీనువైట్లపై గృహహింస కేసును పెట్టారు.అయితే ఇరు కుటుంబాల పెద్దలు ఈ విషయంలో చర్చించి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు.
దాంతో రూప ఫిర్యాదును వెనక్కు తీసుకున్నట్లుగా పోలీసులు ప్రకటించారు.
తాజాగా ఈ విషయంపై ఈ ఇద్దరు భార్య భర్తలు మాట్లాడుతూ.
మీడియాలో వచ్చిన వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అన్నారు.కేసు విషయమే తమకు తెలియదు అని, ఇద్దరం కలిసే ఉన్నాం అని, అలాంటప్పుడు కేసు ప్రస్థావన ఎలా వస్తుందని శ్రీనువైట్ల చెప్పుకొచ్చాడు.
ఇక రూప కూడా తాను కేసు పెట్టినట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదు అని తేల్చి చెప్పింది.కాని వీరిద్దరు అబద్దం చెబుతున్నారు అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.
రూప ఇచ్చిన ఫిర్యాదును వాపసు తీసుకున్నప్పటికి అప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది.దాంతో శ్రీనువైట్ల కోర్టుకు వెళ్లక తప్పని పరిస్థితి.
కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వీరేం చెబుతారో చూడాలి.