శ్రీనువైట్ల కోనవెంకట్ ల వివాదానికి ఇప్పట్లో తెరపడేలా లేదు.కలిసి సినిమాలు చేసారు, తరువాత విడిపోయారు.
అక్కడితో ఎవరి దారి వారిదే అనుకుంటున్న.తరుణంలో రామ్ చరణ్ ఇద్దరి మంచి కోరి బ్రూస్ లీ కోసం కలిపాడు.
చరణ్ మంచి కోరితే అది కాస్త చెడు చేసింది.
బ్రూస్ లీ వలన తగ్గుతాయనుకున్న గొడవలు, మరింతగా పెరిగాయి.
ముదిరిన గొడవలు ఇద్దరు కేసు అనే పదం వాడేదాకా తీసుకెళ్లాయి.ఇన్ని రోజులు ఇద్దరు సైలెంట్ గానే ఉన్నారు.
కాని శంకరాభరణం ప్రమోషన్స్ లో భాగంగా మీడియా మిత్రులకి ఇంటర్వ్యూ ఇచ్చాడు కోన.ఏమాత్రం దాచుకోకుండా, వైట్లకి తనకి గొడవలు ఉన్నాయని, బ్రూస్ లీ కోసం 72 సీన్లు రాసిస్తే వాటిని దర్శకుడు సరిగా వాడుకోలేదని.అంతా చేసి, కథ రాసినవాళ్లలో నా పేరు కూడా వేసి పరువు తీసారని చెప్పుకొచ్చాడు కోన.
ఇలా బాహాటంగా అన్ని బయటపెట్టే సరికి వైట్లకి మండిందట.పరువు నష్టం పేరుతో కోన వెంకట్ మీద కేసు వేయాలని శ్రీనువైట్ల నిశ్చయించుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.దీనికి కోన ఎలా స్పందిస్తాడో చూడాలి.