తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కేరింత’ టీం ప్రస్తుతం విజయోత్సవ యాత్రలు నిర్వహిస్తోంది.ప్రస్తుతం ఏపీలో ఉన్న ఈ చిత్ర యూనిట్పై తాజాగా శ్రీకాకుళం జిల్లాలో కోడిగుడ్లు మరియు టమాటోలతో దాడి జరిగినట్లుగా తెలుస్తోంది.
‘కేరింత’ సినిమాలో కమెడియన్తో శ్రీకాకుళంకు చెందిన యాసతో నటింపజేశారు.కాలేజ్లో పలువురు శ్రీకాకుళం యాసతో మాట్లాడే అతడిని అవమానిస్తూ ఉంటారు.
దాంతో తమ బాష, యాసను అవమానించారు అంటూ శ్రీకాకుళంకు చెందిన ఏబీవీపీ కార్యకర్తలు ఈ సినిమా యూనిట్ సభ్యులపై దాడి చేయడం జరిగింది.
దిల్రాజు నిర్మాణంలో సాయికిరణ్ అడవి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సుమంత్ అశ్విన్ హీరోగా నటించగా శ్రీదివ్య మరియు తేజస్విలు హీరోయిన్స్గా నటించారు.
యూత్ ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంటున్న ఈ సినిమా మొదటి వారం రోజుల్లోనే 4 కోట్లు వసూళ్లు చేసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.అంతా హ్యాపీగా ఉందనుకుంటున్న సమయంలో ఇలా యూనిట్ సభ్యులపైకి దాడి జరగడంతో ఒక సారిగా షాక్ అయ్యారు.
శ్రీకాకుళం ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా సినిమాలో పాత్రను పెట్టినందుకు చిత్ర యూనిట్ సభ్యులు క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది.