టాలీవుడ్తో పాటు బాలీవుడ్, కోలీవుడ్లలో సైతం అతిలోక సుందరి అనిపించుకున్న శ్రీదేవి తాజాగా రీ ఎంట్రీ ఇచ్చింది.పెళ్లి, పిల్లలతో సినిమాలకు గ్యాప్ తీసుకున్న శ్రీదేవి ఆ మధ్య ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.
తాజాగా ఈమె తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా నటిస్తున్న ‘పులి’ సినిమాలో అతి ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది.శ్రీదేవి రీ ఎంట్రీతో ఆమె వారసురాలు జాహ్నవి ఎంట్రీపై వార్తలు జోరుగా వస్తున్నాయి.
రెండు సంవత్సరాల క్రితమే జాహ్నవి సినీ ఎంట్రీపై వార్తలు వచ్చాయి.అయితే అప్పుడు అవి పుకార్లుగానే మిగిలి పోయాయి.
తాజాగా జాహ్నవి సినీ ఎంట్రీ దాదాగా ఖాయం అయినట్లుగా తెలుస్తోంది.తమిళ సినీ వర్గాల ద్వారా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ‘పులి’ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న సమయంలో శ్రీదేవితో ఒక యువ ప్రముఖ తమిళ దర్శకుడు జాహ్నవి కోసం కథను చెప్పాడు అని, అది శ్రీదేవికి కూడా నచ్చినట్లుగా తెలుస్తోంది.
యువ హీరో నటించబోతున్న ఆ తమిళ చిత్రంలో జాహ్నవితో హీరోయిన్గా చేయించేందుకు శ్రీదేవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది.ప్రస్తుతం జాహ్నవి నటనలో శిక్షణ తీసుకుంటుంది.
త్వరలోనే శిక్షణ పూర్తి కానుంది.అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ సంవత్సరం చివర్లో అతిలోక సుందరి వారసురాలు జాహ్నవి కెమెరా ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.
వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.