అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వి తెరంగేట్రానికి రంగం సిద్ధం అవుతుంది.మహేష్ తో ఎంట్రీ ఇప్పించే ఆలోచన చేయగా ఆమె ఎందుకో ఒప్పుకోలేదు అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం జాన్వి వరుణ్ ధావన్ తో సినిమాకు సైన్ చేసింది.
టూ స్టేట్స్ దర్శకుడు అభిషేక్ వర్మన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో జాన్వి చేయడం కరెక్టేనా అన్నది ఇప్పుడు బీ టౌన్ హాట్ టాపిక్
మరి హీరోయిన్ గా ముందు బాలీవుడ్లోనే చేస్తే ఎక్కువ క్రేజ్ వస్తుందని భావించిందో ఏమో గాని మహేష్ మురుగదాస్ సినిమాలో హీరోయిన్ గా అడిగినా జాన్వి నో అని చెప్పేయడం జరిగింది.వరుణ్ తో డెబ్యూ ఇప్పించే ప్రయత్నం మంచిదే అయినా అక్కడ డైరెక్ట్ గా ఫ్లాప్ హీరోయిన్ అనిపించుకుంటే ఇక సౌత్ లో కూడా సినిమాలు కష్టమే మరి ఈ విషయాన్ని ఎలా మర్చిపోయారో ఏమో కాని జాన్వి మాత్రం వరుణ్ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టింది.
ముందు సౌత్ లో ట్రైల్ వేసి ఆ తర్వాత బీ టౌన్ జంప్ అవుతుంది అనుకున్న జాన్వి ఏకంగా బాలీవుడ్ లోనే తన సత్తా చాటేందుకు రెడీ అవుతుంది.మరి ఫలితం ఎలా అందుకుంటుందో చూడాలి.
.