సన్నాఫ్ సత్యమూర్తి సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది.ఇప్పటికే రికార్డు స్థాయి ఓపెనింగ్స్ను ఈ సినిమా వసూళ్లు చేసింది.
అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకు పోతున్న ఈ సినిమా ప్రమోషన్ కూడా అదే స్థాయిలో చేస్తున్నారు.అదే క్రమంలో ఈ సినిమా థ్యాంక్స్ మీట్ను ఏర్పాటు చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు నిర్ణయించుకున్నారు.
ఈ నెల 18న థ్యాంక్స్ మీట్ను నిర్వహించనున్నట్లుగా నిర్మాత ప్రకటించాడు.అయితే ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు.
తాజాగా థ్యాంక్స్ మీట్ను ఈనెల 23న నిర్వహించాలని నిర్ణయించారు.అయితే ఈ థ్యాంక్స్ మీట్ను హైదరాబాద్లో కాకుండా విశాఖ పట్నంలో నిర్వహించాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారు.
ఈ సినిమా ఆడియోను హైదరాబాద్లో జరుపగా, ఆడియో సక్సెస్ మీట్ను విజయవాడలో నిర్వహించిన విషయం తెల్సిందే.తాజాగా ఈ సినిమా థ్యాంక్స్ మీట్ను విశాఖలో నిర్వహించబోతున్నారు.
అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి.ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశాలున్నాయని అంతా భావించారు.
కాని పవన్ ఈ వేడుకకు రాడని తేలిపోయింది.చిత్ర యూనిట్ సభ్యులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు.