ప్రస్తుతం టాలీవుడ్లో అయినా ఎక్కడైనా కూడా ఒక సినిమా మూడు వారాలకు మించి ప్రదర్శింపబడితే చాలా గొప్ప.గతంలో వంద రోజులు, రెండు వందల రోజుల సినిమాలు ఉండేవి.
కాని ఇప్పుడు కోట్ల సినిమాలే ఉంటున్నాయి.కేవలం మొదటి రెండు మూడు వారాల్లోనే పూర్తి కలెక్షన్స్ రాబట్టుకుని, థియేటర్ల నుండి సినిమాను తీసేస్తున్నారు.
ఇలాంటి సమయంలో ఒక సినిమా 50 లేదా 100 రోజలు నడిచింది అంటే అది పెద్ద సక్సెస్ అని చెప్పుకోక తప్పదు.
తాజాగా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా పెద్ద సక్సెస్ను సాధించింది.50కు పైగా థియేటర్లలో 50 రోజులను పూర్తి చేసుకున్న ఈ సినిమా 50 కోట్ల వసూళ్లను సైతం వసూళ్లు చేసింది.ఈ సంవత్సరం బిగెస్ట్ సక్సెస్ సినిమాగా ఈ సినిమా నిలిచింది.
అల్లు అర్జున్, త్రివిక్రమ్ల కాంబినేషన్లో ‘జులాయి’ సినిమా తర్వాత వచ్చిన ఈ సినిమాపై మొదటి నుండే అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఉండటంతో ప్రేక్షకులు ఆధరించారు.
ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా, అదా శర్మ మరియు నిత్యామీనన్లు ముఖ్య పాత్రలో నటించారు.సీనియర్ నటీనటులు రాజేంద్ర ప్రసాద్, ఉపేంద్ర, స్నేహాలు ఈ సినిమాలో నటించారు.