అక్కినేని ఫ్యాన్స్ ‘మనం’ చిత్రం తర్వాత సరైన సినిమాకు నోచుకున్నది లేదు.ఆ లోటును ‘అఖిల్’తో పూడ్చేందుకు అఖిల్ సిద్దం అవుతున్నాడు.
దసరా కానుకగా ఈనెల 26న అఖిల్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉంది.ఆ తర్వాత అక్కినేని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనో’.
ఈ చిత్రం ముందుగా అనుకున్న ప్రకారం నవంబర్ లేదా డిసెంబర్లో విడుదల చేయాల్సి ఉంది.అందుకోసం షూటింగ్ను కూడా పూర్తి చేశారు.
మొత్తం రషెష్ను చూసిన చిత్ర యూనిట్ సభ్యులు కొన్ని ముఖ్యమైన సీన్స్పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగిందట.దాంతో ఈ సినిమా రీషూట్ చేయబోతున్నారు.
నాగార్జుతో పాటు రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠిలు కూడా ఈ రీషూట్లో పాల్గొనబోతున్నారు.భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమాపై చాలా జాగ్రత్తలు నాగార్జున తీసుకుంటున్నాడు అనేందుకు ఇదే నిదర్శనం.
నాగార్జున డబుల్ రోల్లో నటిస్తున్న ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్గా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.రీ షూట్ వల్ల ఈ సినిమాను వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో విడుదల చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.
ఈలోపు నాగార్జున నటిస్తున్న ‘ఊపిరి’ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలున్నాయి.తమిళ స్టార్ హీరో కార్తీతో కలిసి ‘ఊపిరి’ చిత్రంలో నాగార్జున నటించిన విషయం తెల్సిందే.