సూపర్ స్టార్ మహేష్ బాబు – ఎఆర్ మురుగదాస్ సినిమాకి ముహూర్తం దగ్గర పడుతోంది.సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు కానుకగా మే 31న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు సమాచారం.
ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు ఎస్ జే సూర్య విలన్ గా నటించబోతున్న సంగతి తెల్సిందే.ఇక మనకు తెలియని విషయం ఏమిటంటే … మహేష్ సినిమా కోసం ఒక తమిళ అగ్రహీరో సినిమా వదులుకున్నాడు సూర్య.
ధనుష్ హీరోగా రాబోతున్న “ఎనై నొక్కి పాయుం తోటా” లో విలన్ పాత్రకోసం ఎస్ జే సూర్యని సంప్రదించారట.కాని మహేష్ బాబు – మురుగదాస్ సినిమా కోసమని సూర్య ఆ చిత్రాన్ని చేయలేనని చెప్పేశాడట.
దీంతో వేరే విలన్ ని వెతుక్కునే పనిలో పడింది ఆ చిత్ర యూనిట్.నిజానికి మహేష్ – మురుగదాస్ సినిమాలో ముందుగా ఒక బాలివుడ్ నటుడ్ని విలన్ గా అనుకున్నారు.
కాని మురుగదాస్ ఏరికోరి సూర్యని ఎంచుకున్నట్లు సమాచారం.
ఇంకా కథానాయిక ఫిక్స్ కాని ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతాన్ని, సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీని అందించనున్నారు.
ఠాగూర్ మధు తెలుగు, తమిళ భాషల్లో 90 కోట్లతో ఈ భారి ప్రాజెక్టుని నిర్మిస్తారు.