మంచు మనోజ్ హీరోగా నటించిన తాజా చిత్రం శౌర్య.రెజీనా కథానాయికగా కనిపించిన ఈ చిత్రానికి దశరథ్ దర్శకత్వం వహించారు.
ఈరోజే విడుదలైన శౌర్యకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.ఇక అమెరికాలో ఈ చిత్రానికి ఘోరమైన అవమానం జరిగింది.
మంచు మనోజ్ కేరీర్లో అత్యధిక థియేటర్లలో విడుదలైంది శౌర్య.ఓవర్సీస్ లో అవసరానికి మించి విడుదల చేసారు.
అమెరికా కాలిఫోర్నియాలోని ఓ థియేటర్లో ఒక షోకి కేవలం ఒక్క టికేట్ మాత్రమే అమ్మడుపోయింది ఈ సినిమాకి.బయటకి చెప్పుకోలేని విషయం ఇది.మరి దారుణం కాకపోతే ఒకే ఒక్క టికేట్ తెగడం ఏమిటి.
పాపం మనోజ్.
కేరీర్ అసలే నత్తనడకన సాగుతోంది.దశరథ్ లాంటి సినియర్ డైరెక్టర్ కూడా మనోజ్ జాతకాన్ని మార్చకపోగా, ఇలాంటి షాకింగ్ రికార్డు ఒకటి మంచు హీరోకి అంటించేసాడు.