ప్రముఖ సింగర్ సునీత త్వరలో వెండి తెరపై కనిపించబోతుందంటూ మీడియాలో గత రెండు మూడు రోజులుగా తెగ హడావుడిగా ఉన్న విషయం తెల్సిందే.మహేష్బాబు, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ‘బ్రహ్మోత్సవం’లో సునీతను ఒక ముఖ్య పాత్ర కోసం దర్శకుడు సంప్రదించాడు అంటూ వార్తలు వచ్చాయి.
అయితే ఆ వార్తలు నిజం కాదని, కేవలం పుకార్లు మాత్రమే అంటూ కొట్టి పారేశారు.‘బ్రహ్మోత్సవం’ సినిమా కోసం తనను ఏ ఒక్కరు కూడా స్పందించలేదని, తాను ఆ సినిమాలో నటించడం లేదని ప్రకటించింది.
సునీత ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించింది.తనకు పాటలు పాడటం, డబ్బింగ్ చెప్పడం అంటేనే ఇష్టం అని, అంతకు మించి మరేం లేదని చెప్పుకొచ్చింది.
అయితే భవిష్యత్తులో ఎప్పుడు నటించను అని మాత్రం అనడం లేదు.సంగీత ప్రాధాన్యం ఉన్న సినిమాలో, ఆఫ్ బీట్ సినిమాల్లో నటించేందుకు ఓకే చెబుతాను అంటూ తన మనస్సులో మాటను చెప్పుకొచ్చింది.
మరి ఈమె అనుకున్న ఆ సినిమాలు ఎప్పుడు వచ్చేనో, వెండి తెరపై ఈమె తళుకున్న ఎప్పుడు మెరిసేనో చూడాలి.