తెలంగాణ చివరి దశ ఉద్యమంలో తన పాటలతో తెలంగాణ ప్రజల్ని ఉత్తేజితపరిచింది మధుప్రియ.“ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్ల” అనే పాటతో ఇటు తెలంగాణ వారిని, అటు సీమాంధ్ర జనాల్ని విపరీతంగా ఆకట్టుకుంది ఈ యువగాయని.ఆ తరువాత మధుప్రియ పెద్దగా కనిపించలేదు.ఒక్కసారిగా శ్రీకాంత్ అనే యువకుడిని ప్రేమించి పెళ్ళి చేసుకోని వార్తల్లోకి ఎక్కింది మధుప్రియ.
మళ్ళీ, తన భర్తతో గొడవపెట్టుకోని, ఆ తరువాత కలిసిపోయి నానా హంగామ చేసింది.భర్తను తిట్టిన నోటే, ఆకశానికెత్తుకోని అందరి విమర్శలకు గురైంది మధుప్రియ.
వయసుకి తగ్గట్టే పరిణితి లేని మధుప్రియ ఇప్పుడు కేసిఆర్ తన జీవితానికి దారి చూపించాలంటోంది.
మొన్నటికిమొన్నే తనకి స్టార్ డం, ఆస్థి ఉన్నట్లు చెప్పుకున్న మధుప్రియ ఇప్పుడు డబ్బు సంపాదించడానికి కేసిఆరే ఏదైనా దిక్కు చూపించాలని అంటోంది.
తెలంగాణ ఉద్యమంలో తాను ఆరు ఏళ్ళ వయసు నుంచే పనిచేసానని, ఇప్పుడు రాష్ట్రం సాకారమయ్యి, తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని, తాను మాత్రం దిక్కుతోచని స్థితిలో ఉన్నానని చెప్పింది మధుప్రియ.కాబట్టి కేసిఆర్ ఆదుకోవాలట.
కొంపదీసి టీఆర్ఎస్ పార్టిలో చోటుగాని అడగట్లేదు కదా!
.