ఒక్క సినిమా ఎంతమందిని మార్చేసింది ! ఏ ముహూర్తాన మహేష్ ఊరిని దత్తత తీసుకోవాలి నా సినిమాలో అని కొరటాల శివ రాసుకున్నారో గాని … మహేష్ నిజంగానే రెండు ఊర్లను దత్తత తీసుకున్నాడు.తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ , ఆయన కొడుకు కేటిఆర్ ను మొదలుకొని సామాన్య ప్రజల దాకా అందరి మనుసులు దోచుకున్నాడు సూపర్ స్టార్.
తెలంగాణ ప్రభుత్వం గ్రామజ్యోతి అని మొదలుపెడితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్మార్ట్ విలేజ్ అని మొదలుపెట్టిందో .ఈ కార్యక్రమాలపై మహేష్ ప్రభావం ఎంతవరకు ఉందొ తెలియదు కాని, శృతి హాసన్ మీద మాత్రం చాలా అంటే చాలా గట్టిగా పడింది.
ఇప్పుడు శృతి హాసన్ కుడా తమిళనాడు లో ఓ గ్రామాన్ని దత్తత తీసుకోనుంది.అది ఏ గ్రామం అనేది ఇంకా నిర్ణయించుకోలేదు.చిన్న సర్వే చేసి, ఏ గ్రామానికి తన అవసరం ఉందో గమనించి, ఆ గ్రామాన్ని దత్తత తీసుకుంటుందట.ఆ గ్రామానికి సంబంధించి ప్రతి అవసరం దగ్గరుండి చుసుకుంటుందట.
శృతి బయటకి ఎంత అందగత్తో , లోనా అంతే అందమైనది .సినిమాలో మహేష్ అన్నట్టు .” చారుశీల , యు ఆర్ బ్యిటిఫుల్, ఇన్ సైడ్ “
.