మామూలుగానైతే మహేష్ పక్కన నటించే హీరోయిన్లను ఎవరు పట్టించుకోరు.ఎందుకంటే ప్రిన్స్ గ్లామర్ ని తట్టుకోని నిలబడటం చాలా కష్టం.
అపుడెప్పుడో సొనాలి బింద్రే, ఆమధ్యలో కాజల్ అగర్వాల్ మాత్రమే మహేష్ లాంటి అందగాడికి సరైన్ జోడిగా అనిపించారు.వారి తరువాత ఒక హీరోయిన్ మహేష్ పక్కన సెట్ అయ్యింది అంటే అది శృతిహాసనే.
శ్రీమంతుడు సినిమాలో వారి జోడి చక్కగా కుదిరింది.మళ్ళీ వీరిద్దరు ఓ సినిమా చేస్తే బాగుంటుంది అని ప్రేక్షకులకి కూడా అనిపించింది.
అందుకే, ఈ జోడిని తిరిగి తన సినిమాతోనే కలపాలనుకున్నారట దర్శకుడు కొరటాల శివ.కాని ఆ అలోచన వదులుకున్నారు.ఎందుకంటారు?
భరత్ అనే నేను సినిమా కోసం ఎన్నో పేర్లను పరిశీలించారు కొరటాల.ముంబాయిలోని పెద్ద మోడల్స్ ని ఫిల్టర్ చేసారు.
ఓ దశలో కీర్తీ సురేష్ ని ఫిక్స్ చేసుకుందామనుకున్నా, అభిమానుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యేసరికి ఆ ఆలోచన కూడా వర్కవుట్ అవలేదు.బాలివుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానితో ఓ రెండు నెలలలుగా టచ్ లో ఉన్నా, ఎక్కడో కొరటాలకి శృతిహాసన్ మీద ఆసక్తి ఉండిందట.
మహేష్ – శృతి సూపర్ హిట్ జోడి కావడంతో, కియారా కన్నా శృతి అయితనే బెటర్ అని భావించారట.కాని చివరకి బాలివుడ్ భామవైపే మొగ్గుచూపడాని కారణం శృతి హాసన్ ఫిగర్ అని తెలుస్తోంది.
ఇప్పటికే కాటమరాయుడులో చిత్రమైన కాస్ట్యూమ్స్, బరువు పెరిగిన బాడితో విమర్శల దెబ్బపడింది, మళ్ళీ ఇదో కొత్త దెబ్బ.శృతి జిమ్ లో కష్టపడుతోంది.కాని తను మళ్ళీ పాత షేప్ కి వచ్చేసరికి సమయం వృధా అవుతుంది, ఎందుకు రిస్క్ అని శృతిహాసన్ ని కొరటాల వద్దనుకున్నారని టాక్.పాపం శృతి … కాటమరాయుడు ఫలితం షాక్ అయితే, ఇది అంతకన్నా పెద్ద షాక్.
భరత్ అనే నేను రెగ్యులర్ షూట్ మే చివర్లో మొదలవుతుందట.దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్న ఈ సినిమాకి డీవీవీ దానయ్య నిర్మాత.
వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ పొలిటికల్ యాక్షన్ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు మేకర్స్.