అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఎంత భక్తి? ఈమధ్య ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తిన అమెరికా అధినేత అంతటితో ఊరుకోకుండా ఆధ్యాత్మికంగా కూడా తాను భారత్కు దగ్గరివాడినని చెప్పుకుంటున్నారు.అజ్మీర్ దర్గా గురించి చాలామందికి తెలుసు.
ముస్లింలకు ఎంతో పవిత్రమైన ఆ దర్గాకు హిందువులు కూడా వెళుతుంటారు.తీరని కోరికలు తీరినవారు అజ్మీర్ దర్గాకువెళ్లి ‘ఛాద్దర్’ సమర్పించి వస్తుంటారు.
అక్కడ ప్రతి ఏటా హజ్రత్ ఖ్వాజా మొయినుద్దీన్ హసన్ చిష్టీ ఉర్సు జరుగుతుంది.ఈ ఏడాది ఉర్సు ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కోబోతున్నాయి.
ఈసారి ఉర్సుకు బరాక్ ఒబామా ఛాద్దర్ (పవిత్ర వస్ర్తం) సమర్పించనున్నారు.చాలా ఖరీదైన ఎర్రని ఛాద్దర్ను ఒబామా సమర్పిస్తారు.
ఒబామా సమర్పించే ఛాద్దర్ ఇప్పటికే దర్గా వర్గాలకు అందచేశారు.అనేక దేశాలవారు అంటే ప్రధానులు, అధ్యక్షులు ఈ దర్గాకు ఛాద్దర్లు సమర్పించారు.
ఆ జాబితాలో ఒబామా కూడా చేరారు.దక్షిణాసియాకు చెందని ఒక దేశం (అమెరికా) అధ్యక్షుడు ఛాద్దర్ సమర్పించడం ఇదే మొదటిసారి.
ప్రపంచ దేశాలతో సంబంధాలు పెంపొందించుకోవడంలో భక్తి కూడా తన వంతు పాత్ర పోషిస్తుందన్నమాట….!
.