మెగా హీరో వరుణ్ తేజ్, పూరి జగన్నాధ్ల కాంబినేషన్లో తెరకెక్కిన ‘లోఫర్’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.ఈ సినిమాపై దర్శకుడు పూరి జగన్నాధ్ భారీ నమ్మకంను కలిగి ఉన్నాడు.
అయితే ఈ సినిమాపై డిస్ట్రిబ్యూటర్లు మాత్రం నమ్మకంను ఏర్పర్చుకోలేక పోతున్నారు.సి కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రావడం లేదు.
కారణం ఈ సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకం లేక పోవడం.ట్రైలర్ చాలా సాదా సీదాగా, పూరి గత చిత్రాల్లో పలు సీన్స్ను ఎత్తి ఈ సినిమాలో పెట్టినట్లుగా క్లీయర్గా అర్థం అవుతోంది.
ఈ సినిమా ‘అమ్మా నాన్న ఓ తమిళ’ అమ్మాయి తరహాలో ఉండబోతుంది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు మొదటి నుండి కూడా చెబుతున్నారు.అది కూడా డిస్ట్రిబ్యూటర్ల భయానికి ఒక కారణం అయ్యి ఉంటుంది.
గతంలో సూపర్ హిట్ అయిన ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రం ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఉండదు.దాంతో ఆ సినిమా తరహాలోనే ఈ సినిమా ఉందన్న నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లకు సినిమాపై నమ్మకం కగడం లేదు.
ఈ చిత్రాన్ని ఈనెల 17న విడుదల చేయాలని నిర్ణయించారు.అయితే ఇప్పటి వరకు కొన్ని ఏరియాల్లో బిజినెస్ కాలేదు అని, మరి కొన్ని ఏరియాల్లో తక్కువ రేట్కు సినిమా అమ్మడు పోయిందని అంటున్నారు.
భారీ క్రేజ్తో ఈ సినిమా విడుదలవుతుందని భావించిన ‘లోఫర్’కు ఇలాంటి షాక్ తగలడంతో పూరి అసహనంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.