తెలుగులో విలక్షణత కలిగిన హీరోల్లో ఒకడిగా శర్వానంద్ ఈ మధ్య కాస్త ట్రాక్ మార్చి కామెడీ ఎంటర్టైనర్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.ఈ సంవత్సరం సంక్రాంతికి వచ్చిన ఎక్స్ ప్రెస్ రాజా పెద్ద సినిమాల పోటీ ఉన్నా మంచి విజయాన్ని అందుకుంది.
అయితే పొంగల్ హిట్ మజాను ఎంజాయ్ చేసిన శర్వా మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు.ప్రస్తుతం చంద్ర మోహన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న శర్వానంద్ తన తర్వాత సినిమా శతమానం భవతి సంక్రాంతికే రిలీజ్ చేయాల్ని అంటున్నాడట.
దిల్ రాజు నిర్మాణంలో రాబోతున్న శతామనం భవతి సినిమాకు సతీష్ వేగ్నేశ దర్శకత్వం వహిస్తున్నారు.ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పొంగల్ వార్లో ఉంచాలని అంటున్నాడట శర్వానంద్.
ఈ సంవత్సరం లక్కు బాగుండి సోగ్గాడు సూపర్ హిట్, నాన్నకు ప్రేమతో హిట్ గా మిగిలాయి.ఇక డిక్టేటర్ యావరేజ్ గా ఆడింది.
అందుకే మూడు పెద్ద సినిమాల మధ్య ఎక్స్ ప్రెస్ రాజా కలక్షన్స్ కుమ్మేసింది.
కాని వచ్చే ఏడాది అలా కాదు.
బాలయ్య ఎంతో ప్రెస్టిజియస్ గా తెరకెక్కిస్తున్న గౌతమిపుత్ర శాతకర్ణి, మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కత్తిలాంటోడు, ఇంకా నాగార్జున ఓం నమో వెంకటేశాయ.ఈ మూడు సినిమాలు సంక్రాంతి టార్గెట్ పెట్టుకున్నాయి.
మరి ఈ మూడు బడా సినిమాల ధాటికి శర్వానంద్ నెగ్గుకు వచ్చే సత్తా ఉందా అన్నది ఆలోచించాల్సిన విషయం.నిర్మాత ఎలాగు దిల్ రాజు కాబట్టి కచ్చితంగా సినిమా రిలీజ్ విషయాంలో తొందరపడకుండా నిర్ణయం తీసుకుంటాడు.
.