సౌత్ ఇండియాతో పాటు దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్.ఈయన తెరకెక్కించిన ఎన్నో సినిమాలు రికార్డుల వర్షం కురిపించడంతో పాటు, సమాజానికి ఉపయోగపడ్డాయి.
ఇక ఈయన చివరి చిత్రం ‘ఐ’ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది.దాంతో మరింత కసితో తన తర్వాత సినిమాను ప్లాన్ చేస్తున్నాడు.
దాదాపు 180 కోట్లతో ‘ఐ’ సినిమాను తెరకెక్కించిన శంకర్ తాజాగా తాను తీయబోతున్న సినిమాకు ఏకంగా 300 కోట్ల బడ్జెట్ను కేటాయించినట్లుగా తెలుస్తోంది.‘రోబో’ సీక్వెల్ కోసం శంకర్ స్క్రిప్ట్ను రెడీ చేస్తున్నాడు.
ఈ సినిమా తమిళంతో పాటు హిందీలో కూడా ఏకకాలంలో చిత్రీకరించనున్నట్లుగా తెలుస్తోంది.
రజినీకాంత్, ఐశ్వర్య రాయ్ జంటగా నటించిన ‘రోబో’ సినిమా సంచలన విజయం సాధించింది.
ఆ సినిమాకు సీక్వెల్ అంటే అంతకు మించి ఉంటుందనే అంచనాలు ఇప్పటి నుండే ప్రేక్షకుల్లో ఉన్నాయి.దాంతో ఆ అంచనాలను అందుకునే విధంగా ఈ సినిమాను తెరకెక్కించాలనే ఉద్దేశ్యంతో పక్కా స్క్రిప్ట్ను శంకర్ రెడీ చేస్తున్నాడు.
ఇక హిందీలో హీరోగా షారుఖ్ ఖాన్ నటించనుండగా, విలన్గా రజినీకాంత్ నటిస్తాడు, అలాగే తమిళం మరియు తెలుగులో రజినీ హీరోగా కనిపించనుండగా, షారుఖ్ ఖాన్ విలన్గా కనిపించనున్నాడు.ఈ సినిమా ఇదే సంవత్సరం చివర్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి.
దాదాపు రెండు సంవత్సరాల పాటు ఈ చిత్రాన్ని చిత్రీకరించనున్నాడు శంకర్.‘రోబో’ సంచలనాలు సృష్టించింది.
మరి ఈ రోబో`2 ఏం చేస్తుందో చూడాలంటే మరికొంత కాలం ఎదురు చూడాల్సిందే.