కమల్ హాసన్ తనయ శృతిహాసన్ తాజాగా చిక్కుల్లో పడ్డ విషయం తెల్సిందే.నాగార్జున, కార్తిలు కలిసి నటిస్తున్న తెలుగు మరియు తమిళ మల్టీస్టారర్ మూవీలో ఈ అమ్మడు మొదట హీరోయిన్గా నటించేందుకు ఓకే చెప్పి, ఆ తర్వాత డేట్లు కుదరడం లేదని సారీ చెప్పింది.
దాంతో ఆ సినిమాను నిర్మిస్తున్న నిర్మాతలు ఈమెపై చీటింగ్ కేసు పెట్టారు.హైదరాబాద్ క్రిమినల్ కోర్టులో ఈ అమ్మడిపై కేసు నమోదు అవ్వడంతో తాను చేసింది తప్పు అని ఒప్పుకుంది.
తాజాగా ఈమె నిర్మాతలతో మాట్లాడుతూ.తాను చేసింది తప్పు అని ఒప్పుకుంటూ, తనపై పెట్టిన కేసును వెనక్కు తీసుకోవాల్సిందిగా కోరిందట.
ఈమె తరపున తమిళంకు చెందిన ఒక నటుడు రాజీ కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తమిళ మీడియా నుండి వార్తలు వస్తున్నాయి.డేట్లు కుదరక పోవడం వల్లే తప్పుకుంది కాని, మరో ఉద్దేశ్యం ఏం లేదని ఆ నటుడు నిర్మాతలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.
మరి ఆ నిర్మాతలు తమ కేసును వెనక్కు తీసుకుంటారా లేదా శృతిపై చీటింగ్ కేసును కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి.ఇక సినిమాలో శృతి స్థానంలో ఇప్పటికే తమన్నాను బుక్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.