తెలుగులో ఓ స్టార్ హీరో సినిమాకు ఆడియో వేడుక నిర్వహించకపోవడం అన్నది ఈ మధ్య కాలంలో జరగలేదు.అందులోనూ తెలుగు సినిమాల ప్రమోషన్ ను కొత్త పుంతలు తొక్కించిన అల్లు అర్జున్.
తన సినిమాకు ఆడియో ఫంక్షన్ చేయనివ్వకుండా పాటల్ని నేరుగా మార్కెట్లోకి రిలీజ్ చేయడానికి అంగీకరించడం అన్నది ఆశ్చర్యం కలిగించే విషయం.ఐతే ‘సరైనోడు’ టీమ్ స్ట్రాటజీ ఏంటో గానీ.
ఈ రోజు ఆ సినిమా పాటలు నేరుగా మార్కెట్లోకి వచ్చేసాయి .తమన్ సంగీతాన్నందించిన ఆడియోను లహరి మ్యూజిక్ విడుదల చేసింది .ఈ సందర్భంగా అభిమానుల కోసం మరో సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు అల్లు అర్జున్.
ఇప్పటికే టీజర్ లాగా వదిలిన బ్లాక్ బస్టర్ పాటను.
ఈసారి ట్రైలర్ తరహాలో రిలీజ్ చేయబోతున్నారు.మొన్న అర నిమిషం మాత్రమే ఈ పాట చూసిన అభిమానులు.
ఇప్పుడు ఏకంగా రెండు నిమిషాల పాటు.అంటే దాదాపు సగం పాటను ఆస్వాదించడానికి రెడీ అయిపోవచ్చు.
ఆడియోతో పాటు 2 నిమిషాల బ్లాక్ బస్టర్ సాంగ్ ఫుటేజ్ రిలీజ్ చేయబోతున్నట్లు ‘సరైనోడు’ టీమ్ వెల్లడించింది.ఐతే సినిమాకు హైలైట్ గా నిలుస్తుందనుకున్న పాటను సర్ప్రైజ్ లాగా దాచిపెట్టకుండా ముందే అంతా ఓపెన్ చేయడం కరెక్టా అన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.
ఈ పాటలు అంజలితో కలిసి బన్నీ స్టెప్పులు కుమ్మేశాడని మొన్నటి బుల్లి వీడియో చూస్తేనే అర్థమైంది.మరి కొత్తగా రిలీజ్ చేసే వీడియోలో బన్నీ ఇంకేం చూపిస్తాడో చూడాలి.
తెలుసా తెలుసా , యు ఆర్ మై లవ్ , అతిలోక సుందరి ఈ మూడు పాటలకీ మంచి రెస్పాన్స్ ఒస్తోంది.