సర్దార్ బిజినెస్ మొదలుపెట్టారు.ఇప్పటికే బయ్యర్లు సర్దార్ గబ్బర్ సింగ్ నిర్మాతలతో చర్చలు మొదలుపెట్టారు.
అయితే మే 11వ తేదిని విడుదలకు అనుకుంటున్నామని బయ్యర్లకు చెప్పారంట.షెడ్యూలు పక్కగా ప్లాన్ చేసుకున్నారా లేక పవన్ కళ్యాణ్ మూడ్ బాగుండి ఇక బ్రేకులు లేకుండా షూట్ చేద్దామని వరాలిచ్చారా తెలీదు కాని, ఒక్కసారిగా ఎప్రిల్ రేసులో గబ్బర్ సింగ్ సీక్వెల్ ఉన్నట్లు మీడియాకు సమాచారం అందించారు యునిట్ సభ్యులు.
జనవరి నాలుగొవ తేది నుంచి హైదరాబాదులో కొత్త షెడ్యూలు ప్రారంభం కానుంది.20 రోజులకు పైగా జరిగే ఈ షెడ్యూల్ తో సినిమాకి సంబంధించి 70% షూటింగ్ అయిపోతుందట.అదే నిజమైతే ఎప్రిల్ సర్దార్ వచ్చినా వస్తుంది.అది నిజం కాకపోతే, కెవలం అభిమానులు ఆందోళన పడకుండా ఎప్రిల్ లో వస్తున్నామని ప్రకటించినట్లే లెక్క.
బాబి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శరత్ మరార్ నిర్మాత.ఏరోస్ ఇంటర్నేషనల్ చిత్ర హక్కులను కొనుక్కుంది.
కాజల్ అగర్వాల్ కథానాయిక.దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు.
ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే స్వయంగా పవన్ కళ్యాణ్ అందించటం విశేషం.