సౌత్లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ఎంజాయ్ చేస్తోన్న చెన్నై చిన్నది సమంత త్వరలోనే అక్కినేని ఇంట పెద్ద కోడలిగా అడుగు పెడుతోంది.ప్రస్తుతం సమంత వ్యవహరిస్తోన్న తీరు చూస్తుంటే మామ నాగార్జునను మించిన రాజకీయ వ్యూహ రచనా పరురాలిగా స్పష్టంగా కనపడుతోంది.
సమంత ఇటీవల తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైంది.తెలంగాణలో నాగ్తో పాటు అక్కినేని ఫ్యామిలీకి ఉన్న బిజినెస్ల గురించి చెప్పక్కర్లేదు.
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముందుగా నాగ్ ఆస్తులను టార్గెట్ చేసిన టీఆర్ఎస్ సర్కార్ తర్వాత క్రమక్రమంగా నాగ్ ఫ్యామిలీకి బాగా దగ్గరైంది.మంత్రి కేటీఆర్ – నాగ్ ఇటీవల బాగా దగ్గరయ్యారు.
ఈ క్రమంలోనే కేటీఆర్ చొరవతో నాగ్కు కాబోయే కోడలు సమంత తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యారు.ఆమె ఆ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ చేనేత కార్మికులతో పాటు ఆ పరిశ్రమ ఎదుర్కొంటోన్న సమస్యలు తెలుసుకుంటోంది.
ఈ క్రమంలోనే ఆమె తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైన సానియామీర్జా కంటే తెలంగాణ ప్రజల్లో మంచి మార్కులు వేయించుకుంటోంది.నాగార్జున కోడలిగా మారిన తర్వాత సమంత తెలంగాణలో ఉన్న తమ ఫ్యామిలీ ఆస్తులు, వ్యాపారాల కోసం పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తుందని… సమంత పొలిటికల్ ఎంట్రీ వెనక నాగ్ కూడా ఇప్పటికే ప్రణాళికలు రచిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే సమంత వచ్చే ఎన్నికలకు ముందుగా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
సినీగ్లామర్ కోసం వెయిట్ చేస్తోన్న టీఆర్ఎస్ సైతం సమంతను పార్టీలో చేర్చుకునే విషయంలో క్లారిటీ ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆమె పార్టీలో చేరితే సికింద్రాబాద్ సీటు కేటాయించాలని కేటీఆర్ తండ్రి వద్ద ప్రపోజల్ పెట్టినట్టు కూడా రూమర్లు వస్తున్నాయి.క్రిస్టియన్ మైనార్టీలు, సెటిలర్లు ఎక్కువగా ఉన్న సికింద్రాబాద్ నుంచి సమంత పోటీ చేస్తే, అక్కడ మంత్రిగా ఉన్న పద్మారావు పక్కనే ఉన్న ముషీరాబద్కు షిఫ్ట్ అవుతారని టాక్.
ఇది టీఆర్ఎస్లో కీ రోల్ పోషిస్తోన్న కేటీఆర్ తీసుకున్న నిర్ణయం కావడంతో కేసీఆర్ కూడా తప్పకుండా ఓకే చెపుతారని వార్తలు వస్తున్నాయి.ఏదేమైనా ఒకప్పుడు ప్రముఖ సినీనటి జయసుధ ప్రాధినిత్యం వహించిన సీటు నుంచి సమంత బరిలో ఉంటే సికింద్రాబాద్ పాలిటిక్స్లో మరోసారి సినీగ్లామర్ వచ్చినట్టే.!
.