విడుదల అయిన గంటల వ్యవధిలో నే తమిళ సూపర్ స్టార్ తెరి టీజర్ ఇప్పుడు సూపర్ లైక్స్ తో సాగుతోంది.వ్యూ లూ, లైక్ ల విషయం లో పాత రికార్డులు తిరిగరాస్తోంది ఈ టీజర్.
తెరి సినిమాలో మెయిన్ హీరోయిన్ గా సమంత – సైడ్ హీరోయిన్ గా యామీ జాక్షన్ లు నటిస్తున్నారు కానీ ఈ టీజర్ మొత్తం మీద ఒక్కటంటే ఒక్క ఫ్రేం లో కూడా ఇద్దరు హీరోయిన్ లలో ఒక్కరిని కూడా చూపించలేదు డైరెక్టర్ అట్లీ.అసలు హీరోయిన్ లని చూపించక పోవడం తో సమంత చాల సీరియస్ గా ఉంది అని అంటున్నారు.
గతం లో అంజాన్ విషయం లో కూడా ఆమె సీరియస్ అయ్యింది.సూర్య మూవీ అంజాన్(తెలుగులో సికందర్) ఫస్ట్ లుక్ ఇచ్చినపుడు హీరోయిన్ ఫోటో వేయకపోవడంపై సమంత గుర్రుమంది.
ఇండస్ట్రీ లో అంతా మగవారి పెత్తనమే అనీ ఆడవారిని మరీ హీనంగా చూస్తున్నారు అంటూ ఆమె కోప్పడింది .మళ్ళీ అదే ఇప్పుడు రిపీట్ అయ్యింది పైగా విజయ్ లాంటి స్టార్ సినిమా ఇది ఇందులో ఫోకస్ అవడం కంటే ఆమెకి ఏం కావాలి ? సమ్మీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఒస్తుందా అని ఆమె ఫాన్స్ ఎదురు చూస్తున్నారు .హీరో విజయ్ మీద లేక డైరెక్టర్ అట్లీ మీద డైరెక్ట్ గా కోపం చూపించడానికి సిద్దం అవుతోంది ఆమె అంటున్నారు సన్నిహితులు.ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ అవ్వకూడదు అని డైరెక్ట్ విజయ్ కే వార్నింగ్ ఇవ్వాలి అనుకుంటోంది, అనీ సమంతా కీ విజయ్ కీ మధ్య మంచి సత్సంబందాలే ఉన్నాయి అనీ వారు అంటున్నారు .