‘శ్రీమంతుడు’ సినిమాలో నటిస్తున్న మహేష్బాబు ఆ తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో నటించనున్న విషయం తెల్సిందే.వచ్చే నెలలో ‘బ్రహ్మోత్సవం’ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఇప్పటికే ఆ సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పూర్తి చేయడం జరిగింది.ప్రస్తుతం నటీ నటుల ఎంపిక జరుగుతుంది.
మొదటి నుండి ఈ సినిమాలో హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.తాజాగా ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ లేదని తేలి పోయింది.
రకుల్ స్థానంలో సమంతను ఎంపిక చేయడం జరిగింది.
రకుల్ ప్రీత్ సింగ్కు మహేష్ సినిమాలో నటించాలని ఉన్నా కూడా ఈమె అంతకు ముందే అంగీకరించిన సినిమాల వల్ల ‘బ్రహ్మోత్సవం’లో నటించలేని పరిస్థితి.
డేట్లు లేవంటూ సూపర్ ఆఫర్ను రకుల్ కష్టంగానే మహేష్ బాబుతో నటించే అవకాశాన్ని వదులుకున్నట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.టాలీవుడ్లోని ఇద్దరు స్టార్ హీరోలతో ప్రస్తుతం రకుల్ రొమాన్స్ చేస్తున్న విషయం తెల్సిందే.
ఆ ఇద్దరిలో ఒకరు మెగా పవర్ స్టార్ రామ్చరణ్ కాగా మరో హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్.వీరిద్దరు స్టార్ హీరోలు అవ్వడం వల్ల రకుల్ ఎక్కువ డేట్లు కేటాయించినట్లుగా తెలుస్తోంది.
మళ్లీ ఎప్పుడైనా ఈమెకు మహేష్బాబుతో నటించే అవకాశం వస్తుందేమో చూడాలి.