టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ను దక్కించుకున్న విషయం తెల్సిందే.ఇంతటి సూపర్ హిట్ను అందుకున్న తర్వాత మహేష్బాబు ఏ సినిమా చేసినా కూడా ఆ సినిమాకు భారీ క్రేజ్ రావడం ఖాయం.
ఇక మహేష్ ఇప్పటికే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.గత నెలలోనే ఈ సినిమా ప్రారంభం కావాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు.
వచ్చే నెలలో ప్రారంభం కాబోతున్న ఈ సినిమా నుండి ఇప్పటికే ఎంపిక అయిన సమంతను తప్పించినట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమాలో మహేష్బాబుకు జోడీగా ముగ్గురు హీరోయిన్లుగా సమంత, కాజల్, ప్రణీతలను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఎంపిక చేయడం జరిగింది.
అయితే తాజాగా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ఎంపిక అయ్యింది.మొదట ఈమె డేట్లు లేని కారణంగా నో చెప్పింది.
అయితే షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్ల ఇప్పుడు రకుల్ ఈ సినిమాలో చోటు సంపాదించింది.అయితే రకుల్ ఎంట్రీతో ఇప్పటికే ఎంపిక అయిన ఏ హీరోయిన్ ఔట్ అవుతుందా అని అంతా ఎదురు చూశారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి సమంతను తప్పించారని అంటున్నారు.‘బ్రహ్మోత్సవం’లో రకుల్ ప్రీత్ సింగ్, కాజల్, ప్రణీతలతో మహేష్బాబు రొమాన్స్ చేయనున్నాడు.
సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.