స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తెలుగులో కంటే తమిళంలో ఎక్కువ సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే.ఈమె ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా తర్వాత మరో సినిమాతో వచ్చింది లేదు.
ఇక ఈమె మరే సినిమాలో కూడా నటించడం లేదు.అయితే తాజాగా ఈమె త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో నటించబోతుంది అంటూ వార్తలు వచ్చాయి.
ఆ వార్తలు సినీ వర్గాలతో పాటు, ఆమె అభిమానులు మరియు సాదారణ ప్రేక్షకుల్లో కూడా ఆసక్తికని కలిగింది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అంటూ ఒక స్థాయిలో అంతా ఆశించారు.
ఇక సమంత ఆ సినిమాను దున్నేస్తుందనే టాక్ కూడా వచ్చింది.కాని అనూహ్యంగా ఆ సినిమా వార్తలు ఒట్టి పుకార్లుమాత్రమే అంటూ సమంత తేల్చి అభిమానులకు షాక్ ఇచ్చింది.
మీడియాలో వస్తున్న వార్తలు నమ్మవద్దని, అలాంటి సినిమా ఏది రాబోవడం లేదని, దాని గురించి ఎలాంటి చర్చలు కూడా జరగడం లేదు అంటూ సమంత చెప్పుకొచ్చింది.ఒక బ్యాడ్ న్యూస్ చెప్పినా మరో గుడ్ న్యూస్ సమంత వినిపించింది.
ఈమె మహేష్బాబుతో ముచ్చటగా మూడవ సారి జత కట్టబోతున్నట్లుగా చెప్పుకొచ్చింది.‘బ్రహ్మోత్సవం’ సినిమాలో మహేష్కు జోడీగా సమంత హీరోయిన్గా ఎంపిక అయ్యింది.