గత రెండు మూడు రోజులుగా నాగార్జున, నాగచైతన్య, సమంత పురోహితులతో కలిసి ఏదో పూజ చేస్తున్న చిత్రం నెట్ లో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.పురుహితులు కనబడటం,అక్కడ క్రిస్టియన్ అయిన సమంత ఉండటం, నాగచైతన్య – సమంత వచ్చే ఏడాది పెళ్ళి చేసుకోబోతుండటంతో, సమంత అక్కినేని వారింట్లో కలిసిపోయేందుకు మతం మార్చుకుంటోందని వార్తలు మొదలయ్యాలి.
కొందరైతే ఏకంగా నిశ్చితార్థం జరిగిపోయిందని అనేసారు.నిజానికి ఆ చిత్రాలు చూస్తే అలానే అనిపించింది.
కాని సమంత మతం మార్చుకోలేదట.అలాగే నిశ్చితార్థం కూడా జరగలేదు
ఆ ఫోటోలు అన్నపూర్ణ స్టూడియోలో తీసినవి.
స్టూడియోలో ఏవో పూజ కార్యక్రమాలు జరుగుతోంటే, అప్పుడు నాగచైతన్య – సమంత ఖాలిగానే ఉండటంతో, పూజలో కూర్చోమ్మని నాగార్జున చెప్పారట.దాంతో చైతు – సమంత పూజలో పాల్గొన్నారట.
అంతే తప్ప సమంతని మతం మార్చుకోమని అడగలేదని, ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు వారి ఇష్టాయిష్టాలను కూడా ప్రేమించాలని, తనకి మతం కాదు మనిషి ముఖ్యం అని నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు
ఇదండీ జరిగిన సంగతి.అలా ఓ ఫోటోలో పురోహితులు కనబడగానే నిశ్చితార్థం అని, మతం మార్పిడి అని కొత్త కొత్త రూమర్లు పుట్టుకొచ్చాయి.
ఇంకా నయం, విమర్శల వేడి పెరగకముందు నాగచైతన్య జరిగిన విషయాన్ని బయటకి చెప్పేసాడు.