మెగా క్యాంప్ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ ఈమధ్య తన సినిమా విషయాల కన్నా ఎక్కువ పర్సనల్ విషయాల వల్లే వార్తల్లో నిలుస్తున్నాడు.ఓ ఏడాదికాలంగా సాయిధరమ్ తేజ్ కి – రెజీనాకి మధ్య లవ్ ఎఫైర్ నడుస్తోందని వార్తలు గుప్పమంటున్న సంగతి తెలిసిందే.
ఈ వార్తల్ని ఇటు సాయిధరమ్ తేజ్, అటు రెజీనా చాలాసార్లు కొట్టిపారేసారు.మా మధ్య అలాంటిదేమి లేదని, కేవలం మంచి స్నేహితులమని చెప్పుకొచ్చారు.
దాంతో ఆ రూమర్స్ కి బ్రేక్ పడింది.
ఇప్పుడు కొత్తగా సాయిధరమ్ తేజ్ యువ కథానాయిక ప్రగ్యా జైస్వాల్ తో లవ్ స్టోరి మొదలుపెట్టాడని, కృష్ణవంశీ నక్షత్రం సెట్ లో వీరిద్దరికి ఏర్పడిన పరిచయం ప్రేమ వ్యవహారానికి దారి తీసిందని గట్టిగా టాక్ వినబడుతోంది.
ఇందులో నిజానిజాలు ఏంటో మనకు తెలియదు కాని, ఇద్దరు జంటగా హైదరాబాద్ లో చక్కర్లు కొడుతున్నారని, పార్టీల్లో కూడా కలిసి కనబడుతున్నారని ఫిలింనగర్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.
ఈ విషయంపై సాయిధరమ్ కాని, ప్రగ్యా కాని స్పందించేంతవరకు దీన్ని ఓ రూమర్ లానే తీసుకుందాం.
నిజంగానే రిలేషన్ షిప్ లో ఉంటే మీడియాతో దాగుడుమూతలు ఆడే రోజులు కావు కదా ఇవి.