‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యి, మెప్పించిన ముద్దుగుమ్మ రాశిఖన్నా.ఈ అమ్మడు ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘బెంగాల్ టైగర్’.
తాజాగా ఈమెకు మరో ఆఫర్ వచ్చింది.ఈసారి ఈ అమ్మడికి ఏకంగా మెగా ఆఫర్ రావడంతో సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది.
మెగా సినిమాలో నటించాలని ఎంతో మంది హీరోయిన్స్ కోరుకుంటారు.ఆ అవకాశం ఈ అమ్మడికి దక్కడంతో ఈమె క్రేజ్ పెరగడం ఖాయం అని అంతా అనుకుంటున్నారు.
మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం ‘సుబ్రమణ్యం’ ఫర్ సేల్ మూవీలో నటిస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమా పూర్తి కాగానే ‘పటాస్’ చిత్ర దర్శకుడి దర్శకత్వంలో ‘శతమానం భవతి’ అనే సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
దిల్ రాజు నిర్మించబోతున్న ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్కు జోడీగా రాశిఖన్నాను ఎంపిక చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.ఈ సినిమాను సెప్టెంబర్లో సెట్స్ పైకి తీసుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మరో వైపు సాయిధరమ్ మరో దర్శకుడు సునీల్ రెడ్డికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఆ సినిమా కూడా త్వరలో ప్రారంభం కానుంది.
ఆ సినిమాలో హీరోయిన్ ఎంపిక ఇంకా జరగాల్సి ఉంది.